కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. హిట్టు మీద హిట్టు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా ఓ యంగ్ డైరెక్టర్ సినిమా కావడం విశేషం. నటుడిగా తెలుగు సినిమాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తన రెండో సినిమా నాగార్జునతో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ‘మన్మథుడు’ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. సోషల్ మీడియాలో నాగార్జున ఫ్యాన్స్ రాహుల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ రాహుల్ రవీంద్రన్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు.
తాజాగా ఆయన ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీతాఆర్ట్స్ సంస్థకు ఈ కథ నచ్చడంతో నిర్మించడానికి ముందుకొచ్చింది. హీరోయిన్ కీలకపాత్రలో ఈ సినిమా ఉండబోతుంది. దీనికోసం రష్మికను సంప్రదించగా.. ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమాతోనైనా.. రాహుల్ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి!
This post was last modified on September 11, 2021 10:20 am
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…