నేచురల్ స్టార్ నాని కెరీర్లో కొన్ని మంచి అవకాశాలను వదులుకున్న సంగతి ‘టక్ జగదీష్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వెల్లడించాడు. తమిళంలో బ్లాక్బస్టర్ మూవీగా నిలిచిన ‘రాజా రాణి’తో పాటు తెలుగులో భారీ విజయాన్నందుకున్న ఎఫ్-2 సినిమా కూడా తాను డేట్లు ఖాళీ లేక వదులుకున్నట్లు అతను తెలిపాడు. ఐతే నాని ఈ సినిమాలను వదులుకున్నట్లు ఇంతకుముందు కూడా వార్తలొచ్చాయి.
ఐతే బాలీవుడ్లో ఓ మంచి ఆఫర్ వస్తే దాన్ని కూడా నాని తిరస్కరించిన విషయం ఇప్పుడు వెల్లడైంది. ‘లాల్ సింగ్ చద్దా’లో కీలక పాత్ర కోసం స్వయంగా ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ తనకు ఫోన్ చేసి అడిగినట్లు నాని తెలిపాడు. ఐతే అప్పటికే తాను రెండు సినిమాలతో బిజీగా ఉండటం.. వెంటనే ఆ చిత్రానికి డేట్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు వెల్లడించాడు.
నిజానికి ‘లాల్ సింగ్ చద్దా’లో ఈ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ అతను డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమాకు దూరమయ్యాడు. ఆ తర్వాత నానికి ఆఫర్ వచ్చిన విషయం ఇప్పుడు వెల్లడైంది. నాని కూడా ఈ పాత్ర చేయలేకపోవడంతో చివరికి అక్కినేని నాగ చైతన్యకు అవకాశం దక్కినట్లుంది.
ఐతే ఒకరు వద్దన్న రోల్ను ఇంకొకరు చేయడాన్ని నామోషీగా భావించాల్సిన అవసరమేమీ లేదు. ఇలా అవకాశం అందుకుని పెద్ద విజయాలందుకున్న వారి జాబితా చాలా పెద్దదే. చైతూకు కచ్చితంగా ‘లాల్ సింగ్ చద్దా’ కెరీ్లో కీలక మలుపుగా నిలుస్తుందని భావిస్తున్నారు. తండ్రి నాగార్జున వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంతో చైతూ బాలీవుడ్లో పాగా వెయ్యగలడని అంచనా వేస్తున్నారు. ఆమిర్ ఖాన్ సినిమాలో కీలక పాత్రతో దేశవ్యాప్తంగా చైతూకు మంచి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on September 10, 2021 2:25 pm
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…
ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…
తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది ఈ రోజుల్లో. అక్కడ ఏ…
కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం…
ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల…
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చగా మారింది. రూ.2 వేలకు…