కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో తెలిసిందే. ఏడాదిన్నరగా కరోనా దెబ్బకు బాలీవుడ్ అల్లాడిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత మిగతా భాషల్లో సినిమాలు బాగానే విడుదలవుతున్నాయి. ఉన్నంతలో మంచి ఫలితాలే వస్తున్నాయి.
కానీ హిందీ చిత్రాల పరిస్థితి మాత్రం దారుణం. ఫస్ట్ వేవ్ తర్వాత చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే రిలీజయ్యాయి. వాటిని అస్సలు పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్న ఉత్సాహమే వారిలో కనిపించలేదు. కనీసం సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితి మారుతుందనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.
ఈసారి అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన బెల్ బాటమ్ చిత్రాన్ని ఎన్నో ఆశలతో రిలీజ్ చేస్తే దానికి బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పలేదు. బాలీవుడ్ ఆశించిన రివైవల్ కనిపించలేదు. అమితాబ్ బచ్చన్ మూవీ చెహ్రె పరిస్థితీ ఇంతే. ఐతే హిందీ సినిమాలు ఏ స్థాయివి రిలీజ్ చేసినా పట్టించుకోని ప్రేక్షకులు.. ఇంగ్లిష్ చిత్రాలకు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మధ్యే రిలీజైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9.. అలాగే షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా చాలా మంచి వసూళ్లు వస్తున్నాయి. బెల్ బాటమ్తో పోలిస్తే వీటికి రోజువారీ వసూళ్లు రెండు మూడు రెట్లు వస్తున్నాయి. ఈ చిత్రాలను చూడ్డానికి హిందీ ప్రేక్షకులు పెద్ద ఎత్తునే థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్లోనే కాక వీక్ డేస్లోనూ ఈ చిత్రాల థియేటర్లు ఆడియన్స్తో కళకళలాడుతున్నాయి. మరి హాలీవుడ్ సినిమాల మీద ఉన్న ఆసక్తి బాలీవుడ్ మూవీస్ మీద నార్త్ ఆడియన్స్ ఎందుకు చూపించడం లేదన్నది ప్రశ్న.
This post was last modified on September 7, 2021 9:23 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…