కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో తెలిసిందే. ఏడాదిన్నరగా కరోనా దెబ్బకు బాలీవుడ్ అల్లాడిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత మిగతా భాషల్లో సినిమాలు బాగానే విడుదలవుతున్నాయి. ఉన్నంతలో మంచి ఫలితాలే వస్తున్నాయి.
కానీ హిందీ చిత్రాల పరిస్థితి మాత్రం దారుణం. ఫస్ట్ వేవ్ తర్వాత చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే రిలీజయ్యాయి. వాటిని అస్సలు పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్న ఉత్సాహమే వారిలో కనిపించలేదు. కనీసం సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితి మారుతుందనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.
ఈసారి అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన బెల్ బాటమ్ చిత్రాన్ని ఎన్నో ఆశలతో రిలీజ్ చేస్తే దానికి బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పలేదు. బాలీవుడ్ ఆశించిన రివైవల్ కనిపించలేదు. అమితాబ్ బచ్చన్ మూవీ చెహ్రె పరిస్థితీ ఇంతే. ఐతే హిందీ సినిమాలు ఏ స్థాయివి రిలీజ్ చేసినా పట్టించుకోని ప్రేక్షకులు.. ఇంగ్లిష్ చిత్రాలకు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మధ్యే రిలీజైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9.. అలాగే షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా చాలా మంచి వసూళ్లు వస్తున్నాయి. బెల్ బాటమ్తో పోలిస్తే వీటికి రోజువారీ వసూళ్లు రెండు మూడు రెట్లు వస్తున్నాయి. ఈ చిత్రాలను చూడ్డానికి హిందీ ప్రేక్షకులు పెద్ద ఎత్తునే థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్లోనే కాక వీక్ డేస్లోనూ ఈ చిత్రాల థియేటర్లు ఆడియన్స్తో కళకళలాడుతున్నాయి. మరి హాలీవుడ్ సినిమాల మీద ఉన్న ఆసక్తి బాలీవుడ్ మూవీస్ మీద నార్త్ ఆడియన్స్ ఎందుకు చూపించడం లేదన్నది ప్రశ్న.
This post was last modified on September 7, 2021 9:23 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…