గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్కు గురవుతుంటుంది తరచుగా. ‘మి టు’ ఉద్యమంలో భాగంగా ఆమె అలుపెరగని పోరాటం చేస్తోంది కొన్నేళ్లుగా. ఈ క్రమంలో మహిళల హక్కులు, సాధికారత, వారిపై వివక్ష, వేధింపులు లాంటి అంశాల మీద బలంగా తన గళం వినిపిస్తూ ఉంటుందామె.
ఐతే ఎప్పుడూ ఈ విషయాల్లో నీతులు చెప్పే ఆమె.. కొన్నిసార్లు తన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటుందనే విమర్శలు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా చిన్మయి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గతంలో ఒకసారి చిన్మయి సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేసింది. అలాగే సోషల్ మీడియాలో మహిళల్ని ఏడిపించడం, వాళ్ల మీద కౌంటర్లు వేయడం గురించి కూడా పోస్టులు పెట్టింది.
కట్ చేస్తే ఇప్పుడు సమంత మీద ఏదో కామెంట్ చేయడం ద్వారా పూజా హెగ్డే వివాదం రాజేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చింది. అప్పటికి అందరూ పూజానే తప్పుబట్టారు. సమంత వైపు నిలిచారు. కానీ ఇంతలో చిన్మయి లైన్లోకి వచ్చింది.
సమంత టీం అంటూ ట్వీట్ వేసి నందిని రెడ్డి తదితరులను లైన్లోకి తీసుకుంది. వీళ్లంతా కలిసి పూజా మీద కౌంటర్లు వేస్తూ ట్వీట్లు వేశారు. ఈ సంభాషణంతా స్క్రీన్ షాట్లు తీసి సమంత, చిన్మయిల మీద ఎటాక్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ముఖ్యంగా చిన్మయినైతే విపరీతంగా తిడుతున్నారు. దీనిపై చిన్మయి స్పందించింది. తనను ఎలా బూతులు తిడుతున్నారో వెల్లడిస్తూ స్క్రీన్ షాట్లు షేర్ చేసింది. తాను మహిళల సమస్యల మీద మాట్లాడినా.. ఇంకేం చేసినా నెటిజన్ల రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని వాపోయింది.
కానీ ఇంతకుముందు చిన్మయి చేసిన ట్వీట్లేంటి.. ఆమె ఇప్పుడు చేసిన పనేంటి అంటూ ట్విట్టర్ జనాలు ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఒకరు ప్రస్తావిస్తే.. తాను చేసింది తప్పే అన్నట్లు మాట్లాడిన చిన్మయి.. ఆ మాత్రానికి తనను వేశ్య అంటూ బూతులు తిడతారా అంటోంది.
This post was last modified on May 29, 2020 2:47 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…