తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని నెల రోజులు దాటింది. కొత్త సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. వసూళ్లు నామమాత్రంగానే వస్తున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ లాంటి ఒకట్రెండు సినిమాలకు మాత్రమే ఓపెనింగ్స్ సందడి కనిపించింది. థియేటర్లు నిండాయి. మిగతా సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా థియేటర్లు డల్లుగా కనిపించాయి. చాలా మంచి టాక్ తెచ్చుకున్న రాజరాజ చోరకు కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఇది.
ఇక ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికే భయపడిపోయేలా వసూళ్లు ఉంటున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదు. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో సినిమా బెల్బాటమ్కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరాభవం ఎదురైందో తెలిసిందే.
పరిస్థితులు చూస్తుంటే.. ఒకప్పట్లా థియేటర్లు ఎప్పటికీ కళకళలాడవా.. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినా కూడా మునుపటిలా థియేటర్ల నుంచి రెవెన్యూ ఉండదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రేక్షకుల జీవన శైలిలో తెచ్చిన మార్పు.. థియేటర్లకు పెద్దగా శాపంలాగా మారిందని స్పష్టమవుతోంది. వీకెండ్ వస్తే థియేటరుకెళ్లి సినిమా చూడ్డం.. అట్నుంచి అటే రెస్టారెంట్కు వెళ్లి భోంచేయడం.. ఫ్యామిలీ ఆడియన్స్కు ఎప్పట్నుంచో ఉన్న వినోద మార్గం. ఐతే కరోనా కారణంగా ఈ అలవాటు తప్పింది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. అలాగే రెస్టారెంట్లకు వెళ్లి భోంచేసే అలవాటూ తప్పింది. దీనికి తోడు.. కరోనా కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు జనాలు. ప్రతి ఇంట్లోనూ ఓటీటీల సబ్స్క్రైబర్లుంటున్నారు. కొత్త సినిమాలు, సిరీస్లు నేరుగా అందులో చూడ్డానికి అలవాటు పడ్డారు.
థియేటర్లలోకి వచ్చే కొత్త చిత్రాలు కూడా కొన్ని రోజులాగితే ఓటీటీల్లో వస్తాయన్న ఆలోచనలోకి ఓ వర్గం ప్రేక్షకులు వెళ్లిపోయారు. పైగా థియేటర్కెళ్లి ఒక ఫ్యామిలీ సినిమా చూసే ఖర్చుతో సంవత్సరం పాటు ఓటీటీల సబ్స్క్రిప్షన్లు వస్తుండటం వారి ఆలోచనలో మార్పుకు కారణమవుతోంది. రెగ్యులర్ సినీ గోయర్స్ ఇప్పటికీ థియేటర్లకు వస్తున్నా.. ఫ్యామిలీస్లో కొంత శాతం మళ్లీ థియేటర్ల వైపు చూస్తున్నా.. మునుపటి స్థాయిలో మాత్రం లేదన్నది స్పష్టం. అలా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్ ప్రేక్షకులను లాస్ అయిపోయింది ఫిలిం ఇండస్ట్రీ. కాబట్టి సినీ పరిశ్రమ థియేటర్ల రెవెన్యూలో కొంత మేర శాశ్వతంగా కోల్పోయినట్లే కనిపిస్తోంది. ఇంకెప్పటికీ థియేటర్లు ఒకప్పటి స్థాయిలో ఆదాయం రాబట్టలేవన్నది స్పష్టం.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…