తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని నెల రోజులు దాటింది. కొత్త సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. వసూళ్లు నామమాత్రంగానే వస్తున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ లాంటి ఒకట్రెండు సినిమాలకు మాత్రమే ఓపెనింగ్స్ సందడి కనిపించింది. థియేటర్లు నిండాయి. మిగతా సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా థియేటర్లు డల్లుగా కనిపించాయి. చాలా మంచి టాక్ తెచ్చుకున్న రాజరాజ చోరకు కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఇది.
ఇక ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికే భయపడిపోయేలా వసూళ్లు ఉంటున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదు. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో సినిమా బెల్బాటమ్కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరాభవం ఎదురైందో తెలిసిందే.
పరిస్థితులు చూస్తుంటే.. ఒకప్పట్లా థియేటర్లు ఎప్పటికీ కళకళలాడవా.. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినా కూడా మునుపటిలా థియేటర్ల నుంచి రెవెన్యూ ఉండదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రేక్షకుల జీవన శైలిలో తెచ్చిన మార్పు.. థియేటర్లకు పెద్దగా శాపంలాగా మారిందని స్పష్టమవుతోంది. వీకెండ్ వస్తే థియేటరుకెళ్లి సినిమా చూడ్డం.. అట్నుంచి అటే రెస్టారెంట్కు వెళ్లి భోంచేయడం.. ఫ్యామిలీ ఆడియన్స్కు ఎప్పట్నుంచో ఉన్న వినోద మార్గం. ఐతే కరోనా కారణంగా ఈ అలవాటు తప్పింది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. అలాగే రెస్టారెంట్లకు వెళ్లి భోంచేసే అలవాటూ తప్పింది. దీనికి తోడు.. కరోనా కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు జనాలు. ప్రతి ఇంట్లోనూ ఓటీటీల సబ్స్క్రైబర్లుంటున్నారు. కొత్త సినిమాలు, సిరీస్లు నేరుగా అందులో చూడ్డానికి అలవాటు పడ్డారు.
థియేటర్లలోకి వచ్చే కొత్త చిత్రాలు కూడా కొన్ని రోజులాగితే ఓటీటీల్లో వస్తాయన్న ఆలోచనలోకి ఓ వర్గం ప్రేక్షకులు వెళ్లిపోయారు. పైగా థియేటర్కెళ్లి ఒక ఫ్యామిలీ సినిమా చూసే ఖర్చుతో సంవత్సరం పాటు ఓటీటీల సబ్స్క్రిప్షన్లు వస్తుండటం వారి ఆలోచనలో మార్పుకు కారణమవుతోంది. రెగ్యులర్ సినీ గోయర్స్ ఇప్పటికీ థియేటర్లకు వస్తున్నా.. ఫ్యామిలీస్లో కొంత శాతం మళ్లీ థియేటర్ల వైపు చూస్తున్నా.. మునుపటి స్థాయిలో మాత్రం లేదన్నది స్పష్టం. అలా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్ ప్రేక్షకులను లాస్ అయిపోయింది ఫిలిం ఇండస్ట్రీ. కాబట్టి సినీ పరిశ్రమ థియేటర్ల రెవెన్యూలో కొంత మేర శాశ్వతంగా కోల్పోయినట్లే కనిపిస్తోంది. ఇంకెప్పటికీ థియేటర్లు ఒకప్పటి స్థాయిలో ఆదాయం రాబట్టలేవన్నది స్పష్టం.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…