హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. గ్లామర్ ఉన్నంత వరకే వాళ్ల మెరుపులన్నీ. ఫిజిక్, లుక్ కొంచెం తేడా కొట్టగానే అవకాశాలు తగ్గిపోతాయి. అలా తగ్గడం మొదలయ్యాక మళ్లీ కెరీర్లో పుంజుకోవడం కష్టమే. అందులోనూ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైతే హీరోయిన్గా కెరీర్కు దాదాపు తెరపడినట్లే. కొంతమంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా కథానాయికగా అవకాశాలు అందుకుంటారు. ఓ మోస్తరుగా అయినా కెరీర్ను నడిపిస్తారు. కొందరేమో హీరోయిన్ వేషాలు ఆగిపోయాక కొంచెం గ్యాప్ తీసుకుని అక్క, వదిన, తల్లి పాత్రల్లోకి మారిపోతుంటారు.
దక్షిణాది భామ ప్రియమణి పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని అంతా అనుకున్నారు. తెలుగులో ఒకప్పుడు కథానాయికగా ఒక ఐదారేళ్లు మంచి ఊపు మీద ఉంది ప్రియమణి. కానీ తర్వాత ఊపు తగ్గింది. చాలా వేగంగా ఆమె ఫేడవుట్ అయిపోయింది. ఇండస్ట్రీ నుంచి అంతర్థానం అయిపోయింది.
అంతలోనే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడటం.. కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించడం తప్ప సినిమాల్లో కనిపించకపోవడంతో ఆమె కెరీర్ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ ఆశ్చరకరంగా ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఇందుక్కారణం ఒక వెబ్ సిరీస్ కావడం విశేషం. అదే.. ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్లో ఇద్దరు పిల్లల తల్లిగా ప్రియమణి చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ దేశవ్యాప్తంగా ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రియమణి ఎంతో పరిణతితో ఈ పాత్రను పండించిన విధానం అందరినీ మెప్పించింది. దీంతో ఉన్నట్లుండి సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం మొదలైంది.
ఇప్పటికే తెలుగులో నారప్ప, విరాటపర్వం లాంటి పెద్ద చిత్రంలో నటించిన ప్రియమణి.. త్వరలోనే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేయనున్న సినిమాలోనూ ప్రియమణికి ఓ కీలక పాత్ర దక్కినట్లు సమాచారం. బాలీవుడ్లో కచ్చితంగా ప్రియమణికి ఈ పాత్ర ఒక మలుపు అయ్యే అవకాశముంది. ఇంకా వివిధ భాషల్లో ప్రియమణికి అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ ప్రియమణి కెరీర్ను గొప్ప మలుపు తిప్పినట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 5, 2021 10:20 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…