దాదాపు ఏడాది వయసులోనే స్టార్ అయిపోయాడు అక్కినేని అఖిల్. అతను ప్రధాన పాత్ర పోషించిన ‘సిసింద్రీ’ అప్పట్లో ఒక సంచలనం. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో శివనాగేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జునే స్వయంగా నిర్మించాడు. అందులో ఓ కీలక పాత్ర కూడా చేశాడు. ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో ఆమని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇప్పుడు పాతికేళ్ల విరామం తర్వాత ఆమని మళ్లీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో అఖిల్కు తల్లిగా నటించడం విశేషం. అఖిల్ను చూస్తే నిజంగా తన కొడుకు లాగే అనిపిస్తుందని.. ఎప్పటికీ అతణ్ని తన బిడ్డ లాగే భావిస్తానంటూ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమని ఎమోషనల్ అయింది. అఖిల్ కూడా తనను తల్లిలాగే చూస్తాడని ఆమె అంది.
‘సిసింద్రీ’ చేసే సమయానికి అఖిల్కు ఊహ తెలియదని.. కానీ తర్వాత అతను ‘సిసింద్రీ’ సినిమా చూసి తన పట్ల ఆపేక్ష పెంచుకున్నాడేమో తెలియదని.. ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్ షూటింగ్ సందర్భంగా అతను తన మీద చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదని ఆమని తెలిపింది. సెట్లోకి వచ్చాడంటే తాను ఎక్కడ ఉన్నానో వెతుక్కుని మరీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడని.. తనను ఒక అమ్మ లాగే ట్రీట్ చేస్తాడని ఆమని అంది.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది ఆమని. తన తల్లికి తనతో పాటు ఒక కొడుకు ఉన్నాడని.. ఐతే ఇద్దరమ్మాయిల్ని దత్తత తీసుకుని వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి మంచి స్థితికి తీసుకొచ్చిన ఘనత తన తల్లికి దక్కుతుందని ఆమని వెల్లడించింది. తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడే తన తండ్రి చనిపోయాడని.. ఆ సమయంలో తల్లే అండగా నిలిచిందని.. తాను కథానాయికగా నిలదొక్కుకున్నాక ఇంటి బాధ్యతలు తీసుకున్నానని ఆమె చెప్పింది.
This post was last modified on September 2, 2021 1:22 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…