నటుడిగా తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే గొప్ప పేరు సంపాదించి.. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగానూ బహుముఖ ప్రజ్ఞ చాటుకుని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అతడి శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏదో కొత్తగా చేయాలని చూస్తుంటాడు. వ్యక్తిగత జీవితం విషయంలోనూ అతడిది అదే శైలి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. అవసరాలకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట.
తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అతను తేల్చేశాడు. దీనికి కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మాత్రం చెప్పేశాడు. అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. పెళ్లి చేసుకోవాలనుకోవడమే అత్యంత కఠిన నిర్ణయం అన్నాడు అవసరాల. సోలోగా మన జీవితమేదో మనం బతుకుతూ హ్యాపీగా ఉన్నపుడు.. వేరే వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చి వాళ్లతో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నించడం అంత తేలికైన విషయం కాదని.. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కఠిన నిర్ణయమని అతను తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. తన స్నేహితులు భావించినట్లుగా తానేమీ సినిమా రంగంలోకి తెగ కష్టాలు పడిపోలేదని అతనన్నాడు. తనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఎం.ఎస్ చేశాక కూడా ఇటు వైపు వచ్చానని.. చూసేవాళ్లకు తాను సినీ రంగంలో చాలా కష్టపడిపోయానని అనిపిస్తే అనిపించి ఉండొచ్చని.. కానీ తాను ఏం చేసినా ఇష్టంతో చేశాను కాబట్టి అది కష్టంగా అనిపించలేదని అవసరాల చెప్పాడు. తన దర్శకత్వంలో తొలి సినిమాను నిర్మించే ప్రొడ్యూసర్ కోసం తాను మూడేళ్లు ఎదురు చూశానని.. ఐతే కళ్యాణి మాలిక్ ద్వారా సాయి కొర్రపాటి పరిచయం అయ్యాక 45 నిమిషాల్లోనే సినిమా ఓకే చేయించుకున్నానని ఈ ఇంటర్వ్యూలో అవసరాల వెల్లడించాడు.
This post was last modified on September 1, 2021 11:38 am
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…