నటుడిగా తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే గొప్ప పేరు సంపాదించి.. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగానూ బహుముఖ ప్రజ్ఞ చాటుకుని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అతడి శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏదో కొత్తగా చేయాలని చూస్తుంటాడు. వ్యక్తిగత జీవితం విషయంలోనూ అతడిది అదే శైలి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. అవసరాలకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట.
తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అతను తేల్చేశాడు. దీనికి కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మాత్రం చెప్పేశాడు. అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. పెళ్లి చేసుకోవాలనుకోవడమే అత్యంత కఠిన నిర్ణయం అన్నాడు అవసరాల. సోలోగా మన జీవితమేదో మనం బతుకుతూ హ్యాపీగా ఉన్నపుడు.. వేరే వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చి వాళ్లతో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నించడం అంత తేలికైన విషయం కాదని.. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కఠిన నిర్ణయమని అతను తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. తన స్నేహితులు భావించినట్లుగా తానేమీ సినిమా రంగంలోకి తెగ కష్టాలు పడిపోలేదని అతనన్నాడు. తనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఎం.ఎస్ చేశాక కూడా ఇటు వైపు వచ్చానని.. చూసేవాళ్లకు తాను సినీ రంగంలో చాలా కష్టపడిపోయానని అనిపిస్తే అనిపించి ఉండొచ్చని.. కానీ తాను ఏం చేసినా ఇష్టంతో చేశాను కాబట్టి అది కష్టంగా అనిపించలేదని అవసరాల చెప్పాడు. తన దర్శకత్వంలో తొలి సినిమాను నిర్మించే ప్రొడ్యూసర్ కోసం తాను మూడేళ్లు ఎదురు చూశానని.. ఐతే కళ్యాణి మాలిక్ ద్వారా సాయి కొర్రపాటి పరిచయం అయ్యాక 45 నిమిషాల్లోనే సినిమా ఓకే చేయించుకున్నానని ఈ ఇంటర్వ్యూలో అవసరాల వెల్లడించాడు.
This post was last modified on September 1, 2021 11:38 am
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డకు యూత్లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…
మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…
గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి 12 పరుగుల…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…