టాలీవుడ్ మరో నిరాశాజనక వారాంతాన్ని దాటుకుని ముందుకొచ్చేసింది. గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. సుశాంత్ సినిమా పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే నిలవలేకపోయింది. ఆ సినిమా దాదాపు వాషౌట్ అని చెప్పొచ్చు.
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు నుంచి స్ట్రగులవుతూ వస్తున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత పూర్తిగా తేలిపోయింది. సోమవారం షేర్ నామమాత్రంగా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రన్ దాదాపు క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. గత వీకెండ్లో మరో రిలీజ్ ‘హౌస్ అరెస్ట్’ గురించి చెప్పడానికేమీ లేదు. ఇక ఫోకస్ ఈ వారం సినిమాల మీదికి మళ్లింది. అందులో ‘డియర్ మేఘా’కు ఏమంత బజ్ లేదు.
ఐతే అవసరాల శ్రీనివాస్ సినిమా ‘నూటొక్క జిల్లాల అందగాడు’కు మాత్రం మంచి క్రేజే కనిపిస్తోంది. మంచి ఎంటర్టైనింగ్ టీజర్.. ట్రైలర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బట్టతల ఉన్న కుర్రాడి కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లున్నారు. హిందీలో ఈ కాన్సెప్ట్తో రెండు సినిమాలు రిలీజై మంచి ఫలితాన్నందుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
గత వారం సినిమాల పనైపోవడం.. ఈ వారానికి షెడ్యూల్ అయిన సీటీమార్, గల్లీ రౌడీ చిత్రాలు వాయిదా పడటం ‘నూటొక్క జిల్లాల అందగాడు’కు బాగా కలిసొచ్చే విషయాలే. అందుకే ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఫన్నీ ప్రోమోలతో టీవీల్లో, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అవసరాలకు హీరోగా పెద్ద సక్సెస్ రాబోతున్నట్లే.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…