Movie News

సురేష్ బాబు మౌనం.. ఆ సినిమాలకు శాపం

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల విషయంలో సుదీర్ఘ కాలంగా మౌనం పాటిస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ మూల స్తంభాల్లో ఒకడిగా ఉంటూ.. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లను నడిపిస్తూ.. ఎగ్జిబిటర్ల కష్టాలు పట్టకుండా తన ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమాలను ఓటీటీ బాట పట్టించడం ద్వారా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు కొంత కాలంగా.

కరోనా సెకండ్ వేవ్ ముగిసే సమయానికి సురేష్ బాబు దగ్గర విడుదలకు సిద్ధంగా మూడు చిత్రాలున్నాయి. అవే.. నారప్ప, దృశ్యం-2, విరాటపర్వం. వేరే నిర్మాతల భాగస్వామ్యంతో సురేష్ ఈ చిత్రాలను నిర్మించారు. ఈ మూడు చిత్రాలకూ ఓటీటీ డీల్స్ పూర్తయినట్లు రెండు నెలల ముందే వార్తలొచ్చాయి. ఐతే వాటిలో ‘నారప్ప’ ఒకటే అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ విషయాన్ని కూడా చాలా రోజులు దాచి ఉంచి.. సడెన్‌గా సినిమాను రిలీజ్ చేయించాడు సురేష్. ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాను బిగ్ స్క్రీన్లలో రిలీజ్ చేసి థియేటర్ల పునరుజ్జీవానికి తోడ్పడాల్సింది పోయి.. ఓటీటీలో రిలీజ్ చేయడమేంటనే ప్రశ్నలు ఆయన్ని వెంటాడాయి.

కానీ నిర్మాతకు ఏది మంచిదో అది చేస్తాడంటూ ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ మాటకు కట్టుబడినపుడు ధైర్యంగా మిగతా సినిమాల డీల్స్ గురించి కూడా వెల్లడించాల్సింది. అలాగే వాటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాల్సింది. కానీ దృశ్యం-2, విరాటపర్వం సినిమాల విషయంలో ఆయన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు సురేష్ బాబు మౌనం కారణంగా అసలు వార్తల్లో లేకుండా పోయాయి. వాటి స్టేటస్ ఏంటో తెలియట్లేదు. ఎక్కడా వాటి గురించి చర్చే లేదు.

ఈ రోజుల్లో ఇలా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రమోషన్లకు దూరంగా వార్తల్లో లేకుండా పోవడం ఏ సినిమాలకూ మంచిది కాదు. మరి సురేష్ బాబు మనసులో ఏముందన్నది అర్థం కావడం లేదు. ఓటీటీ డీల్స్ పూర్తయితే సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి. లేని పక్షంలో థియేట్రికల్ రిలీజ్‌కైనా రెడీ చేయాలి. మరి ఎటూ కాకుండా ఆ సినిమాలను ఎందుకు పక్కన పెట్టేశారన్నదే అర్థం కాని విషయం.

This post was last modified on August 31, 2021 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

48 minutes ago

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

4 hours ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

5 hours ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

5 hours ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

12 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

14 hours ago