Movie News

సురేష్ బాబు మౌనం.. ఆ సినిమాలకు శాపం

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల విషయంలో సుదీర్ఘ కాలంగా మౌనం పాటిస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ మూల స్తంభాల్లో ఒకడిగా ఉంటూ.. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లను నడిపిస్తూ.. ఎగ్జిబిటర్ల కష్టాలు పట్టకుండా తన ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమాలను ఓటీటీ బాట పట్టించడం ద్వారా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు కొంత కాలంగా.

కరోనా సెకండ్ వేవ్ ముగిసే సమయానికి సురేష్ బాబు దగ్గర విడుదలకు సిద్ధంగా మూడు చిత్రాలున్నాయి. అవే.. నారప్ప, దృశ్యం-2, విరాటపర్వం. వేరే నిర్మాతల భాగస్వామ్యంతో సురేష్ ఈ చిత్రాలను నిర్మించారు. ఈ మూడు చిత్రాలకూ ఓటీటీ డీల్స్ పూర్తయినట్లు రెండు నెలల ముందే వార్తలొచ్చాయి. ఐతే వాటిలో ‘నారప్ప’ ఒకటే అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ విషయాన్ని కూడా చాలా రోజులు దాచి ఉంచి.. సడెన్‌గా సినిమాను రిలీజ్ చేయించాడు సురేష్. ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాను బిగ్ స్క్రీన్లలో రిలీజ్ చేసి థియేటర్ల పునరుజ్జీవానికి తోడ్పడాల్సింది పోయి.. ఓటీటీలో రిలీజ్ చేయడమేంటనే ప్రశ్నలు ఆయన్ని వెంటాడాయి.

కానీ నిర్మాతకు ఏది మంచిదో అది చేస్తాడంటూ ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ మాటకు కట్టుబడినపుడు ధైర్యంగా మిగతా సినిమాల డీల్స్ గురించి కూడా వెల్లడించాల్సింది. అలాగే వాటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాల్సింది. కానీ దృశ్యం-2, విరాటపర్వం సినిమాల విషయంలో ఆయన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు సురేష్ బాబు మౌనం కారణంగా అసలు వార్తల్లో లేకుండా పోయాయి. వాటి స్టేటస్ ఏంటో తెలియట్లేదు. ఎక్కడా వాటి గురించి చర్చే లేదు.

ఈ రోజుల్లో ఇలా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రమోషన్లకు దూరంగా వార్తల్లో లేకుండా పోవడం ఏ సినిమాలకూ మంచిది కాదు. మరి సురేష్ బాబు మనసులో ఏముందన్నది అర్థం కావడం లేదు. ఓటీటీ డీల్స్ పూర్తయితే సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి. లేని పక్షంలో థియేట్రికల్ రిలీజ్‌కైనా రెడీ చేయాలి. మరి ఎటూ కాకుండా ఆ సినిమాలను ఎందుకు పక్కన పెట్టేశారన్నదే అర్థం కాని విషయం.

This post was last modified on August 31, 2021 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

31 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago