Movie News

డ్ర‌గ్స్ కేసు.. ఈడీ ముందుకు పూరీ.. ఏం చెబుతారు?

టాలీవుడ్ స‌హా.. కోలీవుడ్, శ్యాండిల్ వుడ్‌ల‌ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ కేసు విచార‌ణ ప్రారంభ‌మైంది. 2017-19 మ‌ధ్య తెలంగాణ కేంద్రంగా సినీ న‌టుల‌ను విచారించిన‌.. స్థానిక అధికారులు.. అప్ప‌ట్లో నిత్యం వార్త‌ల్లో ఉన్నారు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయ‌ని వార్త‌లు రావ‌డం.. ముంబై కేంద్రంగా కొంద‌రు డ్ర‌గ్స్ వినియోగించి.. భారీ ఎత్తున మ‌నీలాండ‌రింగుల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో నేరుగా ఈ కేసును.. ఈడీ అధికారులు చేప‌ట్టారు. దీనిలో వారు మ‌నీలాండ‌రింగ్ కు సంబంధించిన మూలాల‌ను రాబ‌ట్ట‌నున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలుగు అగ్ర ద‌ర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈడీ అధికారులు ఇటీవ‌ల నోటీసులు జారీ చేశారు. ఈక్ర‌మంలో తాజాగా ఆయ‌న ఈడీ అధికారుల ముందుకు వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏం చెబుతారు? అనేది ఆస‌క్తిగామారింది. ఇప్ప‌టికే అగ్ర హీరో.. ద‌గ్గుబాటి రాణా.. ర‌వితేజ వంటివారి పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈడీ విచార‌ణ ఆస‌క్తిగా ఉత్కంఠ‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు… దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్ను ప్రశ్నించనున్నారు.

మొత్తం 12 మందిపై న‌జ‌ర్‌!

సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్… 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్… ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్… నేరాభియోగ పత్రాల్లో మాత్రం 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే.. ఇప్పుడు వీరిని ఎందుకు ప‌క్క‌క‌కు త‌ప్పించార‌నే కోణంలోనూ ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం ఉంది.

విచార‌ణ కాల్ షీట్లు ఇవే..

మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి
6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్
8న రానా దగ్గుబాటి
9వ తేదీన రవితేజ, శ్రీనివాస్
13వ తేదీన నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్
15న ముమైత్ ఖాన్
17న తనీష్
20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

This post was last modified on August 31, 2021 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

41 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago