Movie News

డ్ర‌గ్స్ కేసు.. ఈడీ ముందుకు పూరీ.. ఏం చెబుతారు?

టాలీవుడ్ స‌హా.. కోలీవుడ్, శ్యాండిల్ వుడ్‌ల‌ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ కేసు విచార‌ణ ప్రారంభ‌మైంది. 2017-19 మ‌ధ్య తెలంగాణ కేంద్రంగా సినీ న‌టుల‌ను విచారించిన‌.. స్థానిక అధికారులు.. అప్ప‌ట్లో నిత్యం వార్త‌ల్లో ఉన్నారు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయ‌ని వార్త‌లు రావ‌డం.. ముంబై కేంద్రంగా కొంద‌రు డ్ర‌గ్స్ వినియోగించి.. భారీ ఎత్తున మ‌నీలాండ‌రింగుల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో నేరుగా ఈ కేసును.. ఈడీ అధికారులు చేప‌ట్టారు. దీనిలో వారు మ‌నీలాండ‌రింగ్ కు సంబంధించిన మూలాల‌ను రాబ‌ట్ట‌నున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలుగు అగ్ర ద‌ర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈడీ అధికారులు ఇటీవ‌ల నోటీసులు జారీ చేశారు. ఈక్ర‌మంలో తాజాగా ఆయ‌న ఈడీ అధికారుల ముందుకు వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏం చెబుతారు? అనేది ఆస‌క్తిగామారింది. ఇప్ప‌టికే అగ్ర హీరో.. ద‌గ్గుబాటి రాణా.. ర‌వితేజ వంటివారి పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈడీ విచార‌ణ ఆస‌క్తిగా ఉత్కంఠ‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు… దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్ను ప్రశ్నించనున్నారు.

మొత్తం 12 మందిపై న‌జ‌ర్‌!

సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్… 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్… ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్… నేరాభియోగ పత్రాల్లో మాత్రం 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే.. ఇప్పుడు వీరిని ఎందుకు ప‌క్క‌క‌కు త‌ప్పించార‌నే కోణంలోనూ ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం ఉంది.

విచార‌ణ కాల్ షీట్లు ఇవే..

మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి
6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్
8న రానా దగ్గుబాటి
9వ తేదీన రవితేజ, శ్రీనివాస్
13వ తేదీన నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్
15న ముమైత్ ఖాన్
17న తనీష్
20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

This post was last modified on August 31, 2021 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

58 minutes ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

6 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

6 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

6 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

7 hours ago