Movie News

డ్ర‌గ్స్ కేసు.. ఈడీ ముందుకు పూరీ.. ఏం చెబుతారు?

టాలీవుడ్ స‌హా.. కోలీవుడ్, శ్యాండిల్ వుడ్‌ల‌ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ కేసు విచార‌ణ ప్రారంభ‌మైంది. 2017-19 మ‌ధ్య తెలంగాణ కేంద్రంగా సినీ న‌టుల‌ను విచారించిన‌.. స్థానిక అధికారులు.. అప్ప‌ట్లో నిత్యం వార్త‌ల్లో ఉన్నారు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయ‌ని వార్త‌లు రావ‌డం.. ముంబై కేంద్రంగా కొంద‌రు డ్ర‌గ్స్ వినియోగించి.. భారీ ఎత్తున మ‌నీలాండ‌రింగుల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో నేరుగా ఈ కేసును.. ఈడీ అధికారులు చేప‌ట్టారు. దీనిలో వారు మ‌నీలాండ‌రింగ్ కు సంబంధించిన మూలాల‌ను రాబ‌ట్ట‌నున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలుగు అగ్ర ద‌ర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈడీ అధికారులు ఇటీవ‌ల నోటీసులు జారీ చేశారు. ఈక్ర‌మంలో తాజాగా ఆయ‌న ఈడీ అధికారుల ముందుకు వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏం చెబుతారు? అనేది ఆస‌క్తిగామారింది. ఇప్ప‌టికే అగ్ర హీరో.. ద‌గ్గుబాటి రాణా.. ర‌వితేజ వంటివారి పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈడీ విచార‌ణ ఆస‌క్తిగా ఉత్కంఠ‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు… దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్ను ప్రశ్నించనున్నారు.

మొత్తం 12 మందిపై న‌జ‌ర్‌!

సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్… 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్… ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్… నేరాభియోగ పత్రాల్లో మాత్రం 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే.. ఇప్పుడు వీరిని ఎందుకు ప‌క్క‌క‌కు త‌ప్పించార‌నే కోణంలోనూ ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం ఉంది.

విచార‌ణ కాల్ షీట్లు ఇవే..

మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి
6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్
8న రానా దగ్గుబాటి
9వ తేదీన రవితేజ, శ్రీనివాస్
13వ తేదీన నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్
15న ముమైత్ ఖాన్
17న తనీష్
20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

This post was last modified on August 31, 2021 2:14 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

12 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

12 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

13 hours ago