మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోశియుమ్’ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, రానా నటిస్తోన్న దీనికి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ రీమేక్ కి సంబంధించిన ఎలాంటి ఊసు లేదు. మొదట్లో శరత్ కుమార్-శశి కుమార్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత కార్తీ-పార్తిబన్ కాంబో తెరపైకి వచ్చింది. ఒక దశలో సూర్య-కార్తీ కలిసి సినిమాలో నటిస్తారంటూ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు తమిళంలో ఈ రీమేక్ ముందుకు కదలడం లేదు. ఇక ఈ సినిమా హిందీ హక్కులను ప్రముఖ హీరో జాన్ అబ్రహం కొనుగోలు చేశారు.
సినిమాను నిర్మించడంతో పాటు తను కూడా ఒక పాత్రలో నటించే ఉద్దేశంతో జాన్ అబ్రహం ఈ సినిమాను ఎంచుకున్నారు. రెండో పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ను ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు అభిషేక్ ఈ రీమేక్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటనేది తెలియనప్పటికీ అభిషేక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నది మాత్రం నిజం. దీంతో ఇప్పుడు మరో హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు జాన్ అబ్రహం.
This post was last modified on August 30, 2021 2:14 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…