సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఈ బ్యూటీ కాస్త బొద్దుగానే కనిపించేది. ‘మహానటి’ సినిమా కోసం మరింత బరువు పెరిగి చబ్బీగా తయారైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తరువాత కీర్తి జీరో సైజ్ లోకి మారిపోయింది. అప్పటివరకు క్యూట్ గా కనిపించిన కీర్తి బక్కగా తయారవ్వడం అభిమానులకు నచ్చలేదు. ఈ లుక్ విషయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు.
అయితే ఇప్పుడు మరోసారి అమ్మడు బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. కృతిసనన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో ‘మిమీ’ అనే సినిమా తెరకెక్కింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుపుతోంది.
ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ను మెయిన్ లీడ్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టారని టాక్. ఓ విదేశీ జంటకు బిడ్డను కనివ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని అమ్మాయి కథే ‘మిమీ’. ఈ సినిమాలో గర్భవతిగా కనిపించడం కోసం కృతిసనన్ దాదాపు కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు ఈ పాత్రకు కీర్తి సురేష్ ఓకే చెబితే మాత్రం ఆమె కూడా కచ్చితంగా బరువు పెరగాల్సి ఉంటుంది. మరి కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
This post was last modified on August 30, 2021 1:38 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…