ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేసే యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు కానీ, పిల్లి మేడలో ముందుగా గంట కట్టేది ఎవరన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైనా బిగ్ ప్లేయర్ దిగితే మిగతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని ఓటిటీ ప్లాటుఫామ్స్ వాళ్ళకి ఎరుకే. అందుకే ఏకంగా దిల్ రోజునే దించాలని చూసారు.
వి సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు పై చిలుకు కాగా డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ కి 16 నుంచి 18 కోట్లు మాత్రమే ఆఫర్ చేసారు. మిగతాది స్ట్రీమ్స్ లో షేర్ ఇస్తామని చెప్పారు. అయితే పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు ఇది అసలు రిలీజ్ మార్గమే కాదని దిల్ రాజు మిన్నకున్నారు.
అంతే కాకుండా తనలాంటి బడా నిర్మాత ఒత్తిడికి గురైతే చిన్న నిర్మాతలు ఇంకా ఆందోళన పడతారని, అలాగే సీనియర్ పంపిణీదారుడిగా పంపిణీ రంగానికి చేటు చేసే దాంట్లో మొదటి అడుగు తానూ వేయలేనని దిల్ రాజు సన్నిహితులతో చెప్పారట.
This post was last modified on May 29, 2020 2:13 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…