ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేసే యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు కానీ, పిల్లి మేడలో ముందుగా గంట కట్టేది ఎవరన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైనా బిగ్ ప్లేయర్ దిగితే మిగతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని ఓటిటీ ప్లాటుఫామ్స్ వాళ్ళకి ఎరుకే. అందుకే ఏకంగా దిల్ రోజునే దించాలని చూసారు.
వి సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు పై చిలుకు కాగా డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ కి 16 నుంచి 18 కోట్లు మాత్రమే ఆఫర్ చేసారు. మిగతాది స్ట్రీమ్స్ లో షేర్ ఇస్తామని చెప్పారు. అయితే పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు ఇది అసలు రిలీజ్ మార్గమే కాదని దిల్ రాజు మిన్నకున్నారు.
అంతే కాకుండా తనలాంటి బడా నిర్మాత ఒత్తిడికి గురైతే చిన్న నిర్మాతలు ఇంకా ఆందోళన పడతారని, అలాగే సీనియర్ పంపిణీదారుడిగా పంపిణీ రంగానికి చేటు చేసే దాంట్లో మొదటి అడుగు తానూ వేయలేనని దిల్ రాజు సన్నిహితులతో చెప్పారట.
This post was last modified on May 29, 2020 2:13 am
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…