తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అరంగేట్రమే ఒక సంచలనం. 17 ఏళ్ల వయసులో ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమా ‘3’తో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కోసం అతను ట్యూన్ చేసిన ‘కొలవెరి’ పాట ఎంతటి సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాట ఫ్లూక్ అనుకోవడానికి వీల్లేకుండా అదే సినిమాలో మిగతా పాటలనూ అద్భుత రీతిలో కంపోజ్ చేశాడు అనిరుధ్. నేపథ్య సంగీతమూ ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో అతను ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.
విజయ్, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్.. ఇలా బడా బడా హీరోలతో అతను సినిమాలు చేశాడు. టాప్ డైరెక్టర్లతోనూ పని చేశాడు. అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ల ‘అజ్ఞాతవాసి’తో జరగడం విశేషం. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అనిరుధ్కు ఇక్కడ ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలతో తనేంటో చాటి చెప్పాడు. త్వరలో ఎన్టీఆర్-కొరటాల సినిమాకు అతను సంగీతం అందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే అనిరుధ్ ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అతను ఒక మెగా మూవీతోనే అరంగేట్రం చేయబోతున్నాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తీయబోయే సినిమాకు అనిరుధే సంగీత దర్శకుడట. ఈ చిత్రానికి స్క్రిప్టు లాక్ అయింది. ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కాస్ట్ అండ్ క్రూ ఎంపికలో అట్లీ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుందని ఇప్పటికే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పుడు సంగీత దర్శకుడిగా అనిరుధ్ అనే అప్డేట్ బయటికొచ్చింది. చూస్తుంటే షారుఖ్ సినిమాను సౌత్ ప్రేక్షకులకు కూడా చేరువ చేయడం కోసం ఇక్కడ అందరికీ కనెక్టయ్యేలా నయనతార, అనిరుధ్ లాంటి వాళ్లను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్లున్నాడు అట్లీ. అనిరుధ్ ప్రతిభేంటో అందరికీ తెలిసిందే కాబట్టి బాలీవుడ్లో కూడా అతను బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇస్తాడనే అంచనా వేస్తున్నారు
This post was last modified on August 30, 2021 8:36 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…