Movie News

బాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అరంగేట్రమే ఒక సంచలనం. 17 ఏళ్ల వయసులో ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమా ‘3’తో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కోసం అతను ట్యూన్ చేసిన ‘కొలవెరి’ పాట ఎంతటి సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాట ఫ్లూక్ అనుకోవడానికి వీల్లేకుండా అదే సినిమాలో మిగతా పాటలనూ అద్భుత రీతిలో కంపోజ్ చేశాడు అనిరుధ్. నేపథ్య సంగీతమూ ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో అతను ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.

విజయ్, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్.. ఇలా బడా బడా హీరోలతో అతను సినిమాలు చేశాడు. టాప్ డైరెక్టర్లతోనూ పని చేశాడు. అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘అజ్ఞాతవాసి’తో జరగడం విశేషం. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అనిరుధ్‌కు ఇక్కడ ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలతో తనేంటో చాటి చెప్పాడు. త్వరలో ఎన్టీఆర్-కొరటాల సినిమాకు అతను సంగీతం అందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదిలా ఉంటే అనిరుధ్ ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అతను ఒక మెగా మూవీతోనే అరంగేట్రం చేయబోతున్నాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తీయబోయే సినిమాకు అనిరుధే సంగీత దర్శకుడట. ఈ చిత్రానికి స్క్రిప్టు లాక్ అయింది. ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కాస్ట్ అండ్ క్రూ ఎంపికలో అట్లీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుందని ఇప్పటికే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పుడు సంగీత దర్శకుడిగా అనిరుధ్ అనే అప్‌డేట్ బయటికొచ్చింది. చూస్తుంటే షారుఖ్ సినిమాను సౌత్ ప్రేక్షకులకు కూడా చేరువ చేయడం కోసం ఇక్కడ అందరికీ కనెక్టయ్యేలా నయనతార, అనిరుధ్ లాంటి వాళ్లను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్లున్నాడు అట్లీ. అనిరుధ్ ప్రతిభేంటో అందరికీ తెలిసిందే కాబట్టి బాలీవుడ్లో కూడా అతను బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇస్తాడనే అంచనా వేస్తున్నారు

This post was last modified on August 30, 2021 8:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago