టాలీవుడ్లో ఇప్పుడు కొత్త సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. ముందు ఒక డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం.. మళ్లీ కొత్త డేట్ ఇవ్వడం కామన్ అయిపోతోంది. మొన్నటిదాకా ‘లవ్ స్టోరి’ మూవీ సెప్టెంబరు 10కి ఫిక్స్ అనుకుంటూ వచ్చారు. కానీ నిన్న కథ మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల విషయంలో నెలకొన్న అయోమయం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 3న రావాల్సిన ‘సీటీమార్’ చిత్రాన్ని 10వ తేదికి మార్చడంతో ‘లవ్ స్టోరి’ వాయిదా విషయం ఖరారైపోయింది.
మరోవైపు సెప్టెంబరు 10న ‘లవ్ స్టోరి’ ఖాయమైతే నాని సినిమా ‘టక్ జగదీష్’ను కొన్ని రోజులు ఆలస్యంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ.. ‘లవ్ స్టోరి’ వాయిదాతో ఆ చిత్రాన్ని 10కే ఫిక్స్ చేశారు. ఇక ముందేమో నితిన్ మూవీ ‘మ్యాస్ట్రో’ను సెప్టెంబరు 9కే అనుకున్నారు కానీ.. ఇప్పుడా చిత్రాన్ని ఎనిమిది రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
సెప్టెంబరు 17న శుక్రవారం ఈ చిత్రం హాట్ స్టార్లో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు హాట్ స్టార్ వాళ్లే అధికారిక ప్రకటన చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఇటీవలే రిలీజ్ చేసిన ‘మ్యాస్ట్రో’ ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. హిందీలో మాదిరే ఉత్కంఠభరితంగా సినిమాను తీర్చిదిద్దినట్లున్నారు.
జీవనోపాధి కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. అనుకోకుండా ఓ హత్యను చూస్తే ఎలా స్పందిస్తాడనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నితిన్ సరసన నభా నటేష్ నటించిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఒరిజినల్లో టబు చేసిన ఈ పాత్రే సినిమాలో హైలైట్గా ఉంటుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’లో మాస్ట్రో తెరకెక్కింది.
This post was last modified on August 29, 2021 11:21 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…