Movie News

థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నాం కానీ..

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కేవలం నటుడే కాదు.. నిర్మాత కూడా. అతను ఇప్పటికే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో నిర్మాతగా మారాడు. గత ఏడాదే కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను మొదలుపెట్టాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించిన సత్య హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథతో అతణ్ని హీరోను చేశాడు సందీప్. ‘వివాహ భోజనంబు’ ట్రైలర్ చూస్తే సినిమా ఒక నవ్వుల విందు అనే సంకేతాలు కనిపించాయి.

రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు చేసే ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడి ఇంట్లోకి బంధుగణం పెద్ద ఎత్తున ఊడిపడ్డ సమయంలో లాక్ డౌన్ కారణంగా అందరూ అక్కడే ఇరుక్కుపోతే ఆ కుర్రాడు పడే కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా సాగిపోయేలా కనిపిస్తోందీ చిత్రం. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవాళ్లేమో అన్న అభిప్రాయం ట్రైలర్ చూసినపుడు కలిగింది.

ఐతే ‘వివాహ భోజనంబు’ ఓటీటీ బాట పట్టింది. శుక్రవారం సోనీ లివ్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ ఓటీటీలో రిలీజవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మధ్యలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారం నిజం కాలేదు. ఐతే తాము ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమే అని నిర్మాత సందీప్ కిషన్ తెలిపాడు.

“వివాహ భోజనంబు ఒక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దీంతో ఓటీటీకి వెళ్లాలనుకున్నాం. కానీ ఈ మధ్య మళ్లీ థియేటర్లు తెరుచుకుని మళ్లీ జనాలు థియేటర్లకు వస్తుండటంతో పెద్ద తెరల్లోనే సినిమాను రిలీజ్ చేద్దామా అని అనుకున్నాం. కానీ మాకు ఓటీటీ నుంచి చాలా మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా మంచిదనిపించింది. నాతో పాటు మిగతా నిర్మాతలం కూడా కలిసి ఆలోచించుకుని ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం” అని సందీప్ అన్నాడు.

This post was last modified on August 26, 2021 11:55 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

1 hour ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

2 hours ago

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

3 hours ago

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

3 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

4 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

5 hours ago