Movie News

థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నాం కానీ..

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కేవలం నటుడే కాదు.. నిర్మాత కూడా. అతను ఇప్పటికే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో నిర్మాతగా మారాడు. గత ఏడాదే కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను మొదలుపెట్టాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించిన సత్య హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథతో అతణ్ని హీరోను చేశాడు సందీప్. ‘వివాహ భోజనంబు’ ట్రైలర్ చూస్తే సినిమా ఒక నవ్వుల విందు అనే సంకేతాలు కనిపించాయి.

రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు చేసే ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడి ఇంట్లోకి బంధుగణం పెద్ద ఎత్తున ఊడిపడ్డ సమయంలో లాక్ డౌన్ కారణంగా అందరూ అక్కడే ఇరుక్కుపోతే ఆ కుర్రాడు పడే కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా సాగిపోయేలా కనిపిస్తోందీ చిత్రం. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవాళ్లేమో అన్న అభిప్రాయం ట్రైలర్ చూసినపుడు కలిగింది.

ఐతే ‘వివాహ భోజనంబు’ ఓటీటీ బాట పట్టింది. శుక్రవారం సోనీ లివ్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ ఓటీటీలో రిలీజవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మధ్యలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారం నిజం కాలేదు. ఐతే తాము ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమే అని నిర్మాత సందీప్ కిషన్ తెలిపాడు.

“వివాహ భోజనంబు ఒక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దీంతో ఓటీటీకి వెళ్లాలనుకున్నాం. కానీ ఈ మధ్య మళ్లీ థియేటర్లు తెరుచుకుని మళ్లీ జనాలు థియేటర్లకు వస్తుండటంతో పెద్ద తెరల్లోనే సినిమాను రిలీజ్ చేద్దామా అని అనుకున్నాం. కానీ మాకు ఓటీటీ నుంచి చాలా మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా మంచిదనిపించింది. నాతో పాటు మిగతా నిర్మాతలం కూడా కలిసి ఆలోచించుకుని ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం” అని సందీప్ అన్నాడు.

This post was last modified on August 26, 2021 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago