సోషల్ మీడియానా మజాకానా? అన్నట్లుగా మారింది. గతంలో ఎంతో కష్టపడి.. లక్ తోడైతే తప్పించి స్టార్ స్టేటస్ వచ్చేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నం. టాలెంట్ ఉండాలే కానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. దాదాపు నాలుగైదు నెలల క్రితం రిలీజ్ చేసిన బుల్లెట్ బండి పాటకు ఒక మోస్తరు రెస్పాన్స్ వస్తే.. అదే పాటను తన బరాత్ రోజున నడి రోడ్డు మీద కాబోయే భర్త ఎదుట పాడిన పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బకు ఈ పాట ఒక్కసారిగా పాపులర్ కావటమే కాదు.. ఆ వధువు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆమెకొచ్చిన క్రేజ్ ఎంత ఎక్కువన్నది చూస్తే.. తాజాగా ఆమెకు అనుకోని బంఫర్ ఛాన్స్ దక్కించుకుంది.
మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ ఉద్యోగి కుమార్తె సాయి శ్రీయకు రామకృష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్ తో పెళ్లి ఖాయం కావటం తెలిసిందే. ఈ నెల 14న జరిగిన పెళ్లి వేళ.. జానపద గీతమైన బుల్లెట్ బండి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ భారీగా వైరల్ కావటమే కాదు.. ఒరిజినల్ పాటకు మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి వేములవాడకు వెళ్లిన ఈ జంటను చూసి అక్కడి వారంతా విపరీతంగా ఎగబడటం.. వారిలో ఫోటోలు తీసుకునేందుకు పడిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. అంతలా వారి ఇమేజ్ పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ బుల్లెట్ పాటను నిర్మించిన సంస్థ పేరు బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్. దీనికి నిర్వాహకురాలు నిరూప. తాజాగా బుల్లెట్ బండి పాటకు డ్యాన్సు వేసిన వధువుకు ఆమె నేరుగా ఫోన్ చేశారు. తమ సంస్థలో తదుపరి షూట్ చేసే పాటకు నటించాలన్న ఆఫర్ ను ఇచ్చారు. దీంతో.. ఊహించని రీతిలో వచ్చిన ఈ బంఫర్ ఆఫర్ కు కొత్త పెళ్లి కుమార్తె ఓకే చెప్పేసింది. దీంతో.. సాయిశ్రీ ప్రధాన పాత్రగా మరో పాట రానుంది. అనుకోని అవకాశాన్ని తెచ్చిన పెట్టిన సోషల్ మీడియా ఇప్పుడెంత పవర్ ఫుల్ అన్నది అర్థమవుతుందా?
This post was last modified on August 25, 2021 10:04 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…