‘కేజీఎఫ్’ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా నిజానికి రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనరే. కాకపోతే దాన్ని ప్రశాంత్ ఒక డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసిన తీరు.. హీరోయిజాన్ని, మాస్ అంశాలను ఎలివేట్ చేసిన వైనం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యాన్ని ఎంచుకోవడం కూడా ఈ చిత్రానికి ప్రత్యేకతను చేకూర్చింది. ఈ చిత్రంలో విలన్ పాత్రధారుల లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ప్రశాంత్ పెట్టిన ఎఫర్ట్ అందరికీ తెగ నచ్చేసింది.
‘కేజీఎఫ్-చాప్టర్ 1’లో గరుడ పాత్ర చేసిన రామ్ లుక్ ప్రేక్షకులను ఒక రకమైన అలజడికి గురి చేపగా.. ‘చాప్టర్-2’లో సంజయ్ దత్ లుక్ వామ్మో అనిపించేసింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ రూపొందిస్తున్న ‘సలార్’ చిత్రంలో హీరో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది.
తాజాగా ఇందులో రాజమనార్ పాత్రలో జగపతి బాబు లుక్ను రివీల్ చేశారు. ఇందులోనూ ప్రశాంత్ స్టయిల్ కనిపించింది. ఐతే ఈ లుక్ చూశాక సోషల్ మీడియాలో ఫన్నీగా పంచులు కూడా వేస్తున్నారు నెటిజన్లు. ప్రశాంత్ సినిమా అంటే హీరో అయినా.. విలన్ అయినా ముందు నల్లగా మారిపోతారని.. తన చిత్రంలో ఎవరు నటించినా వాళ్లకు ముందు అతను బొగ్గు పూయించేస్తాడని.. విలన్లనగానే గడ్డం పెంచి ముక్కుకు, చెవులకు రింగులు తొడిగించేస్తారని.. ఇది అతడి టెంప్లేట్ స్టయిల్ అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా జగపతి బాబు లుక్ మీద ఇలాంటి కౌంటర్లు చాలానే పడుతున్నాయి.
‘అరవింద సమేత’లో బసిరెడ్డి లుక్లోనే జగపతి బాబు కనిపిస్తున్నాడని.. అందుకు మించి అందులో కొత్తదనం ఏమీ లేదని.. కేవలం ముఖానికి ప్రశాంత్ తన స్టయిల్లో బొగ్గు మాత్రమే పూశాడని.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ మీమ్స్ వేస్తున్నారు.
This post was last modified on August 23, 2021 6:03 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…