ఇండియాలో వెబ్ సిరీస్ల సంస్కృతిని ముందుగా అందిపుచ్చుకున్నది బాలీవుడ్ వాళ్లే. అక్కడ పేరున్న తారలతో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్లు తయారయ్యాయి. మిగతా ఇండస్ట్రీలో అంత వేగంగా వెబ్ సిరీస్లకు అలవాటు పడలేకపోయాయి. ఐతే కరోనా రాకతో కథ మారిపోయింది. ఓటీటీల జోరు బాగా పెరగడంతో ప్రాంతీయ భాషల్లో పెద్ద ఎత్తున ఒరిజినల్స్ మొదలయ్యాయి. తెలుగులో ఆహా ఓటీటీ.. గత ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వెబ్ సిరీస్లను రూపొందించింది.
ఐతే ఇటీవలే వచ్చిన ‘కుడి ఎడమైతే’ మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించింది. లాక్డ్, సిన్ లాంటి సిరీస్లు పర్వాలేదు. ఐతే ఈ సిరీస్లను పరిశీలిస్తే ఎక్కువగా హాలీవుడ్, హిందీ వెబ్ సిరీస్లకు అనుకరణలా కనిపిస్తాయి. వాటిలో మన నేటివిటీ కనిపించదు. కాగా చాయ్ బిస్కెట్ వాళ్లు రూపొందించిన ‘30 వెర్సస్ 21’ అచ్చమైన తెలుగు వెబ్ సిరీస్ లాగా కనిపించింది. అది అంచనాల్ని మించిపోయి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ కోవలో ఇప్పుడు మరో తెలుగు వెబ్ సిరీస్.. తెలుగు ప్రేక్షకుల మనసు దోస్తోంది. అదే.. తరగతి గది దాటి. ఆహా కోసం దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన సిరీస్ ఇది. ‘కలర్ ఫోటో’లో పాపులర్ అయిన తరగతి గది దాటి అనే పాట పల్లవి నుంచి ఈ టైటిల్ తీసుకోవడంతో ఏదో క్యాష్ చేసుకునే ప్రయత్నంలా కనిపించింది కానీ.. ట్రైలర్ చూస్తే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. ఈ శుక్రవారమే ‘తరగతి గది దాటి’ రిలీజైంది.
ఐదు ఎపిసోడ్లతో షార్ట్ అండ్ స్వీట్గా ఉన్న వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ల్యాగ్ లేకుండా తక్కువ నిడివితో.. మంచి ఫ్లోతో.. ఈ ఐదు ఎపిసోడ్లు సాగిపోవడం.. మంచి ఫీల్ ఉండటం.. ఎంటర్టైన్మెంట్కు తోడు ఎమోషన్లు కూడా సరిగా పండటంతో యూత్కు ఈ సిరీస్ బాగా నచ్చేస్తోంది. అన్ని పాత్రలకూ సరైన ఆర్టిస్టులను తీసుకోవడం.. అందరూ చక్కగా పెర్ఫామ్ చేయడం కూడా దీనికి ప్లస్ అయింది. హిందీలో వచ్చిన ‘ఫ్లేమ్స్’ ఆధారంగా ఈ సిరీస్ను తీర్చిదిద్దాడు దర్శకుడు మల్లిక్ రామ్. ఇంతకుముందు ‘విక్కీ డోనర్’ను ‘నరుడా డోనరుడా’గా రీమేక్ చేసి దెబ్బ తిన్న మల్లిక్.. ఈ సిరీస్లో బాగానే ప్రతిభ చూపించాడు.
This post was last modified on August 23, 2021 8:09 am
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…