థియేటర్స్ వెర్సస్ ఓటీటీ గొడవ చాలా పెద్దదైపోతోంది టాలీవుడ్లో. మంచి క్రేజున్న కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి థియేటర్ ఇండస్ట్రీని దెబ్బ తీయొద్దంటున్న ఎగ్జిబిటర్లు తరచుగా నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేస్తుండటం తెలిసిందే. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఎగ్జిబిటర్లు ఓటీటీ బాట పట్టిన ‘టక్ జగదీష్’ విషయంలో హీరో నానీని టార్గెట్ చేయడం.. భవిష్యత్తులో రాబోయే నాని చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వం అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ విషయంలో నాని ప్రమేయం ఏమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే తన సినిమాను రిలీజ్ చేయించాలని నాని గట్టిగా ప్రయత్నించాడు. ఇందుకోసం అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు.
అసలు ఏ స్టార్ అయినా కూడా తన చిత్రం థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు రాబట్టి అభిమానుల్లో జోష్ నింపాలని, తన ఇమేజ్ ఇంకా పెరగాలనే కోరుకుంటారు. అందుకు నాని కూడా మినహాయింపు కాదు. ఐతే థియేటర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ‘టక్ జగదీష్’ విషయంలో నిర్మాతలు ఓటీటీ బాట పడితే తనేం చేయలేకపోయాడు. ఐతే ఎగ్జిబిటర్లు మాత్రం నిర్మాతలను కాకుండా నానిని టార్గెట్ చేసి అతడి తర్వాతి చిత్రాల సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. అసలు కరోనా టైంలో ఎగ్జిబిటర్లే కాదు.. నిర్మాతలూ నష్టపోయారు. ఒక సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్కు దాని మీద పూర్తి హక్కుంటుంది. తనకు ఎలా ఎక్కువ ప్రయోజనం ఉంటుందనిపిస్తే ఆ మార్గంలో తన చిత్రాన్ని రిలీజ్ చేసుకునే హక్కు ఆయనకు ఉంటుంది.
ఐతే అదే సమయంలో కరోనా కారణంగా కుదేలైన థియేటర్ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన అవసరమూ ఉన్న మాట వాస్తవమే. కానీ స్వయంగా చెప్పుకోదగ్గ థియేటర్లను చేతిలో ఉంచుకున్న సురేష్ బాబే ఇప్పుడు సినిమాలకు థియేటర్లలో ఆశించిన వసూళ్లు రావట్లేదని అంచనా వేసి, అలాగే ఏపీలో టికెట్ల రేట్ల సమస్యను కూడా దృష్టిలో ఉంచుకుని ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. సురేష్ బాబు ఇండస్ట్రీలో బిగ్ షాట్ కాబట్టి ఎగ్జిబిటర్లు ఆయన్ని ఒక్క మాటా అనలేకపోయారని.. నానీని మాత్రం టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకోవైపు నాని నటించిన ‘వి’ చిత్రాన్ని మరో అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది ఓటీటీలో రిలీజ్ చేయడమూ గుర్తుండే ఉంటుంది. ఆయన చేతిలోనూ బోలెడన్ని థియేటర్లున్నాయి. మరి ఎగ్జిబిటర్ల వ్యవస్థలో భాగమైన ఈ ఇద్దరూ తమ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసినపుడు.. ‘టక్ జగదీష్’ విషయంలోనూ ఇంత వివాదం చేయడం చిత్రంగా అనిపిస్తోంది. నిజంగా రేప్పొద్దున నాని కొత్త చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వకపోతే అది పెద్ద గొడవగా మారే అవకాశముంది. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on August 21, 2021 3:52 pm
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు ఒక చోట తేలిగ్గానే ఫలితం వస్తోంది. కానీ…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…