Movie News

టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగాల్సిందే..

థియేటర్స్ వెర్సస్ ఓటీటీ గొడవ చాలా పెద్దదైపోతోంది టాలీవుడ్లో. మంచి క్రేజున్న కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి థియేటర్ ఇండస్ట్రీని దెబ్బ తీయొద్దంటున్న ఎగ్జిబిటర్లు తరచుగా నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేస్తుండటం తెలిసిందే. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఎగ్జిబిటర్లు ఓటీటీ బాట పట్టిన ‘టక్ జగదీష్’ విషయంలో హీరో నానీని టార్గెట్ చేయడం.. భవిష్యత్తులో రాబోయే నాని చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వం అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ విషయంలో నాని ప్రమేయం ఏమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే తన సినిమాను రిలీజ్ చేయించాలని నాని గట్టిగా ప్రయత్నించాడు. ఇందుకోసం అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు.

అసలు ఏ స్టార్ అయినా కూడా తన చిత్రం థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు రాబట్టి అభిమానుల్లో జోష్ నింపాలని, తన ఇమేజ్ ఇంకా పెరగాలనే కోరుకుంటారు. అందుకు నాని కూడా మినహాయింపు కాదు. ఐతే థియేటర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ‘టక్ జగదీష్’ విషయంలో నిర్మాతలు ఓటీటీ బాట పడితే తనేం చేయలేకపోయాడు. ఐతే ఎగ్జిబిటర్లు మాత్రం నిర్మాతలను కాకుండా నానిని టార్గెట్ చేసి అతడి తర్వాతి చిత్రాల సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. అసలు కరోనా టైంలో ఎగ్జిబిటర్లే కాదు.. నిర్మాతలూ నష్టపోయారు. ఒక సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్‌కు దాని మీద పూర్తి హక్కుంటుంది. తనకు ఎలా ఎక్కువ ప్రయోజనం ఉంటుందనిపిస్తే ఆ మార్గంలో తన చిత్రాన్ని రిలీజ్ చేసుకునే హక్కు ఆయనకు ఉంటుంది.

ఐతే అదే సమయంలో కరోనా కారణంగా కుదేలైన థియేటర్ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన అవసరమూ ఉన్న మాట వాస్తవమే. కానీ స్వయంగా చెప్పుకోదగ్గ థియేటర్లను చేతిలో ఉంచుకున్న సురేష్ బాబే ఇప్పుడు సినిమాలకు థియేటర్లలో ఆశించిన వసూళ్లు రావట్లేదని అంచనా వేసి, అలాగే ఏపీలో టికెట్ల రేట్ల సమస్యను కూడా దృష్టిలో ఉంచుకుని ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. సురేష్ బాబు ఇండస్ట్రీలో బిగ్ షాట్ కాబట్టి ఎగ్జిబిటర్లు ఆయన్ని ఒక్క మాటా అనలేకపోయారని.. నానీని మాత్రం టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకోవైపు నాని నటించిన ‘వి’ చిత్రాన్ని మరో అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది ఓటీటీలో రిలీజ్ చేయడమూ గుర్తుండే ఉంటుంది. ఆయన చేతిలోనూ బోలెడన్ని థియేటర్లున్నాయి. మరి ఎగ్జిబిటర్ల వ్యవస్థలో భాగమైన ఈ ఇద్దరూ తమ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసినపుడు.. ‘టక్ జగదీష్’ విషయంలోనూ ఇంత వివాదం చేయడం చిత్రంగా అనిపిస్తోంది. నిజంగా రేప్పొద్దున నాని కొత్త చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వకపోతే అది పెద్ద గొడవగా మారే అవకాశముంది. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

This post was last modified on August 21, 2021 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago