బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువైనపుడు ఒకట్రెండు చిత్రాలు రేసు నుంచి తప్పుకోవడం మామూలే. ఐతే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి ఇగో అడ్డొస్తుంటుంది నిర్మాతలకు. తామెందుకు వెనక్కి తగ్గాలి.. వేరే వాళ్లు వెనక్కి వెళ్లొచ్చు కదా అన్న వాదన లేవనెత్తుతుంటారు. ఐతే అలా వెనక్కి తగ్గినంత మాత్రాన భయపడ్డేమీ కాదు. అది అందరికీ మంచి చేసే నిర్ణయమే అవుతుంది.
ఈ నెల చివరి వారానికి హడావుడిగా మూడు పేరున్న చిత్రాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. అవే.. శ్రీదేవి సోడా సెంటర్, నూటొక్క జిల్లాల అందగాడు, ఇచట వాహనములు నిలుపరాదు. ఈ మూడు చిత్రాల మీదా ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. వేటికవే విభిన్నమై కథాంశాలతో తెరకెక్కాయి. ఆయా చిత్రాలపై వాటి నిర్మాతల్లో బాగానే నమ్మకం కనిపిస్తోంది.
ఐతే థియేటర్లు ఈ మధ్యనే మొదలై ఇండస్ట్రీ పుంజుకుంటున్న సమయంలో ఇలా ఒకే వారం మూడు పేరున్న చిత్రాలు విడుదల కావడం అంత మంచిది కాదన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిష్-దిల్ రాజు కలిసి నిర్మించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రాన్ని రేసులోంచి తప్పించారు. ఈ చిత్రాన్ని వారం లేటుగా సెప్టెంబరు 3న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు కొత్తగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఐతే ఈ విషయాన్ని మామూలుగా చెప్పకుండా హీరో అవసరాల శ్రీనివాస్ ముభావంగా ఉన్న స్టిల్ ఒకటి రిలీజ్ చేసి.. నూటొక్క జిల్లాల అందగాడు అలిగాడని, వారం లేటుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఫన్నీ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోటీ ఎక్కువవడంతో అనివార్య పరిస్థితుల్లోనే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చినా.. ఆ విషయాన్ని సరదాగా చెప్పడం ద్వారా స్పోర్టివ్ స్పిరిట్ చూపించిన ఈ చిత్ర బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
This post was last modified on August 15, 2021 9:45 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…