కొందరు హీరోలు పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మలుచుకునే విధానం ఆశ్చర్యం గొలుపుతుంటుంది. అందుకోసం ఎంత బరువైనా పెరగడానికి, అలాగే ఎలా చిక్కిపోవడానికైనా వాళ్లు సిద్ధమే. ముఖ్యంగా ఈ విషయంలో తమిళ హీరోల కమిట్మెంటే వేరు. ఒకప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రల కోసం ఎంత కష్టపడేవారో.. అద్భుతమైన మేకోవర్లతో ఎలా ఆశ్చర్యపడేవారో తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ ఆ స్థాయిలో కష్టపడి మంచి పేరు సంపాదించాడు. సేతు, పితామగన్, ఐ లాంటి చిత్రాల కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఐతే ఇప్పుడు మరో కథానాయకుడు మేకోవర్ విషయంలో అందరికీ పెద్ద షాకిస్తున్నాడు. అతనే.. శింబు. ఈ పేరెత్తగానే చాలామందికి వివాదాలే గుర్తుకొస్తాయి. అసలు కమిట్మెంట్ లేని హీరోగా చాలామందితో విమర్శలు ఎదుర్కొన్న నటుడితను. క్రమశిక్షణా రాహిత్యానికి మారుపేరుగా అతణ్ని చెబుతుంటారు.
ఇలాంటి హీరో ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెందు తనిందద కాదు’ అనే సినిమా కోసం పడుతున్న కష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శింబును చూసి అందరూ షాకయ్యారు. కాటి కాపరి అవతారంలో అతను గుర్తు పట్టలేని విధంగా కనిపించాడు. ఐతే కొందరేమో గ్రాఫిక్ వర్క్ ద్వారా శింబును అలా చూపించారని కౌంటర్లు వేశారు. కానీ తాజాగా శింబు ఈ పాత్ర కోసం పడ్డ కష్టానికి నిదర్శనంగా ఒక ఫొటోను రిలీజ్ చేశాడు.
ఏకంగా 15 కిలోల బరువు తగ్గి బక్క చిక్కి గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నాడు శింబు అందులో. కొన్నేళ్ల ముందు ఓ సినిమా కోసం బరువు పెరిగిన శింబు ఫొటోను, దీన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరే అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. కేవలం బరువు తగ్గడం కాదు.. ఒంట్లో ఎక్కడా ఫ్లెష్ అన్నదే లేకుండా ఎముకలు తేలినట్లు కనిపిస్తున్నాడు శింబు. అతడి ఈ మేకోవర్కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సెన్సేషనే క్రియేట్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2021 9:55 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…