కొందరు హీరోలు పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మలుచుకునే విధానం ఆశ్చర్యం గొలుపుతుంటుంది. అందుకోసం ఎంత బరువైనా పెరగడానికి, అలాగే ఎలా చిక్కిపోవడానికైనా వాళ్లు సిద్ధమే. ముఖ్యంగా ఈ విషయంలో తమిళ హీరోల కమిట్మెంటే వేరు. ఒకప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రల కోసం ఎంత కష్టపడేవారో.. అద్భుతమైన మేకోవర్లతో ఎలా ఆశ్చర్యపడేవారో తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ ఆ స్థాయిలో కష్టపడి మంచి పేరు సంపాదించాడు. సేతు, పితామగన్, ఐ లాంటి చిత్రాల కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఐతే ఇప్పుడు మరో కథానాయకుడు మేకోవర్ విషయంలో అందరికీ పెద్ద షాకిస్తున్నాడు. అతనే.. శింబు. ఈ పేరెత్తగానే చాలామందికి వివాదాలే గుర్తుకొస్తాయి. అసలు కమిట్మెంట్ లేని హీరోగా చాలామందితో విమర్శలు ఎదుర్కొన్న నటుడితను. క్రమశిక్షణా రాహిత్యానికి మారుపేరుగా అతణ్ని చెబుతుంటారు.
ఇలాంటి హీరో ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెందు తనిందద కాదు’ అనే సినిమా కోసం పడుతున్న కష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శింబును చూసి అందరూ షాకయ్యారు. కాటి కాపరి అవతారంలో అతను గుర్తు పట్టలేని విధంగా కనిపించాడు. ఐతే కొందరేమో గ్రాఫిక్ వర్క్ ద్వారా శింబును అలా చూపించారని కౌంటర్లు వేశారు. కానీ తాజాగా శింబు ఈ పాత్ర కోసం పడ్డ కష్టానికి నిదర్శనంగా ఒక ఫొటోను రిలీజ్ చేశాడు.
ఏకంగా 15 కిలోల బరువు తగ్గి బక్క చిక్కి గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నాడు శింబు అందులో. కొన్నేళ్ల ముందు ఓ సినిమా కోసం బరువు పెరిగిన శింబు ఫొటోను, దీన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరే అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. కేవలం బరువు తగ్గడం కాదు.. ఒంట్లో ఎక్కడా ఫ్లెష్ అన్నదే లేకుండా ఎముకలు తేలినట్లు కనిపిస్తున్నాడు శింబు. అతడి ఈ మేకోవర్కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సెన్సేషనే క్రియేట్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2021 9:55 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…