కొందరు హీరోలు పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మలుచుకునే విధానం ఆశ్చర్యం గొలుపుతుంటుంది. అందుకోసం ఎంత బరువైనా పెరగడానికి, అలాగే ఎలా చిక్కిపోవడానికైనా వాళ్లు సిద్ధమే. ముఖ్యంగా ఈ విషయంలో తమిళ హీరోల కమిట్మెంటే వేరు. ఒకప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రల కోసం ఎంత కష్టపడేవారో.. అద్భుతమైన మేకోవర్లతో ఎలా ఆశ్చర్యపడేవారో తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ ఆ స్థాయిలో కష్టపడి మంచి పేరు సంపాదించాడు. సేతు, పితామగన్, ఐ లాంటి చిత్రాల కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఐతే ఇప్పుడు మరో కథానాయకుడు మేకోవర్ విషయంలో అందరికీ పెద్ద షాకిస్తున్నాడు. అతనే.. శింబు. ఈ పేరెత్తగానే చాలామందికి వివాదాలే గుర్తుకొస్తాయి. అసలు కమిట్మెంట్ లేని హీరోగా చాలామందితో విమర్శలు ఎదుర్కొన్న నటుడితను. క్రమశిక్షణా రాహిత్యానికి మారుపేరుగా అతణ్ని చెబుతుంటారు.
ఇలాంటి హీరో ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెందు తనిందద కాదు’ అనే సినిమా కోసం పడుతున్న కష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శింబును చూసి అందరూ షాకయ్యారు. కాటి కాపరి అవతారంలో అతను గుర్తు పట్టలేని విధంగా కనిపించాడు. ఐతే కొందరేమో గ్రాఫిక్ వర్క్ ద్వారా శింబును అలా చూపించారని కౌంటర్లు వేశారు. కానీ తాజాగా శింబు ఈ పాత్ర కోసం పడ్డ కష్టానికి నిదర్శనంగా ఒక ఫొటోను రిలీజ్ చేశాడు.
ఏకంగా 15 కిలోల బరువు తగ్గి బక్క చిక్కి గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నాడు శింబు అందులో. కొన్నేళ్ల ముందు ఓ సినిమా కోసం బరువు పెరిగిన శింబు ఫొటోను, దీన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరే అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. కేవలం బరువు తగ్గడం కాదు.. ఒంట్లో ఎక్కడా ఫ్లెష్ అన్నదే లేకుండా ఎముకలు తేలినట్లు కనిపిస్తున్నాడు శింబు. అతడి ఈ మేకోవర్కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సెన్సేషనే క్రియేట్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2021 9:55 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…