తమ సినిమాల ప్రి రిలీజ్, ఆడియో వేడుకల్లో దాని మేకర్స్.. టీంలో ముఖ్యులు ఆహా ఓహో అని పొగిడేసుకోవడం మామూలే. కొన్నిసార్లు ఈ స్వోత్కర్షలు మరీ శ్రుతి మించి పోతుంటాయి. ఆ సమయానికి ఎలివేషన్ల లాగా అనిపించినా.. సినిమా రిలీజై తేడా కొట్టాక ఆ మాటలు ట్రోల్ మెటీరియల్స్ అయిపోతుంటాయి.
ఈ మధ్య ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫూల్స్ డే సందర్భంగా తెలుగులో డిజాస్టర్లయిన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో వాటి దర్శకులు చెప్పిన గొప్పల్ని తీసుకుని ‘ఫూల్స్ డే’ని సెలబ్రేట్ చేశారు నెటిజన్లు. ‘శక్తి’ గురించి మెహర్ రమేష్.. ‘అజ్ఞాతవాసి’ గురించి త్రివిక్రమ్.. ‘వినయ విధేయ రామ’ గురించి బోయపాటి చెప్పిన మాటలే ఇప్పుడు ట్రోల్ కంటెంట్గా మారిపోవడం గమనార్హం.
కాబట్టి తమ చిత్రాలపై ఎంత ధీమా ఉన్నప్పటికీ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందు, వెనుక చూసుకోవాలి. కానీ ఈ శనివారం రిలీజ్ కానున్న కొత్త చిత్రం ‘పాగల్’ గురించి దాని హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్లు జనాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. “సర్కస్లో సింహంతో అందరూ ఆడుకుంటారు. కానీ నేను అడవిలోకెళ్లి సింహంతో ఆడుకునే టైపు.. మూసుకున్న థియేటర్లను కూడా తెరిపిస్తా ఈ సినిమాతో. నా పేరు విశ్వక్సేన్. అలా కాకుంటే పేరు మార్చుకుంటా” అంటూ ఘనమైన ప్రకటనలు చేశాడు విశ్వక్సేన్.
సంబంధిత వీడియోను పట్టుకుని నెటిజన్లు విశ్వక్సేన్ను ఇప్పటికే ఆడేసుకుంటున్నారు. మరీ ఇంత అతినా.. ఈ స్టేట్మెంట్లేటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా తేడా కొడితే ఉంటుంది నీకు అంటూ విశ్వక్కు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్లలో తన గురించి తాను ఇచ్చుకున్న ఎలివేషన్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే విశ్వక్ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయినట్లే ఉంది. సినిమా బాగుంటే ఓకే కానీ.. ఏమాత్రం అటు ఇటు అయినా నెటిజన్లకు అతను మామూలుగా టార్గెట్ అవ్వడు.
This post was last modified on August 13, 2021 4:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…