తమ సినిమాల ప్రి రిలీజ్, ఆడియో వేడుకల్లో దాని మేకర్స్.. టీంలో ముఖ్యులు ఆహా ఓహో అని పొగిడేసుకోవడం మామూలే. కొన్నిసార్లు ఈ స్వోత్కర్షలు మరీ శ్రుతి మించి పోతుంటాయి. ఆ సమయానికి ఎలివేషన్ల లాగా అనిపించినా.. సినిమా రిలీజై తేడా కొట్టాక ఆ మాటలు ట్రోల్ మెటీరియల్స్ అయిపోతుంటాయి.
ఈ మధ్య ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫూల్స్ డే సందర్భంగా తెలుగులో డిజాస్టర్లయిన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో వాటి దర్శకులు చెప్పిన గొప్పల్ని తీసుకుని ‘ఫూల్స్ డే’ని సెలబ్రేట్ చేశారు నెటిజన్లు. ‘శక్తి’ గురించి మెహర్ రమేష్.. ‘అజ్ఞాతవాసి’ గురించి త్రివిక్రమ్.. ‘వినయ విధేయ రామ’ గురించి బోయపాటి చెప్పిన మాటలే ఇప్పుడు ట్రోల్ కంటెంట్గా మారిపోవడం గమనార్హం.
కాబట్టి తమ చిత్రాలపై ఎంత ధీమా ఉన్నప్పటికీ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందు, వెనుక చూసుకోవాలి. కానీ ఈ శనివారం రిలీజ్ కానున్న కొత్త చిత్రం ‘పాగల్’ గురించి దాని హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్లు జనాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. “సర్కస్లో సింహంతో అందరూ ఆడుకుంటారు. కానీ నేను అడవిలోకెళ్లి సింహంతో ఆడుకునే టైపు.. మూసుకున్న థియేటర్లను కూడా తెరిపిస్తా ఈ సినిమాతో. నా పేరు విశ్వక్సేన్. అలా కాకుంటే పేరు మార్చుకుంటా” అంటూ ఘనమైన ప్రకటనలు చేశాడు విశ్వక్సేన్.
సంబంధిత వీడియోను పట్టుకుని నెటిజన్లు విశ్వక్సేన్ను ఇప్పటికే ఆడేసుకుంటున్నారు. మరీ ఇంత అతినా.. ఈ స్టేట్మెంట్లేటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా తేడా కొడితే ఉంటుంది నీకు అంటూ విశ్వక్కు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్లలో తన గురించి తాను ఇచ్చుకున్న ఎలివేషన్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే విశ్వక్ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయినట్లే ఉంది. సినిమా బాగుంటే ఓకే కానీ.. ఏమాత్రం అటు ఇటు అయినా నెటిజన్లకు అతను మామూలుగా టార్గెట్ అవ్వడు.
This post was last modified on August 13, 2021 4:15 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…