సెలబ్రెటీలు చాలా మంది ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆదాయం పెంచుకుంటున్నారంటూ గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలు.. ఇన్ స్టా ఆదాయంలో ముందున్నారని కూడా విన్నాం. అయితే.. వీరికి తాను కూడా ఏమీ తీసిపోనని నిరూపిస్తోంది అక్కినేని కోడలు.
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు దక్షిణాదిన అగ్ర కథనాయికగా వెలుగొందారు. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ను కొనసాగిస్తున్నారు సామ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నారామె. ఇక సోషల్ మీడియాలోనూ సమంత యాక్టివ్గా వుంటారు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపైనే ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఫాలోయింగ్ విషయంలోనూ సౌత్లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి . ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.
దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు సమంత. ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్ట్కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందట. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
This post was last modified on August 13, 2021 12:44 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…