సెలబ్రెటీలు చాలా మంది ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆదాయం పెంచుకుంటున్నారంటూ గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలు.. ఇన్ స్టా ఆదాయంలో ముందున్నారని కూడా విన్నాం. అయితే.. వీరికి తాను కూడా ఏమీ తీసిపోనని నిరూపిస్తోంది అక్కినేని కోడలు.
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు దక్షిణాదిన అగ్ర కథనాయికగా వెలుగొందారు. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ను కొనసాగిస్తున్నారు సామ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నారామె. ఇక సోషల్ మీడియాలోనూ సమంత యాక్టివ్గా వుంటారు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపైనే ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఫాలోయింగ్ విషయంలోనూ సౌత్లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి . ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.
దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు సమంత. ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్ట్కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందట. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…