ఓ పక్క సోనూ సూద్ కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేపడుతుంటే.. జీవితానికి సరిపడా సంపాదించుకోవడం ఏంటి అనిపిస్తోందా? అతడి కొత్త సంపాదన డబ్బు కాదులెండి. పేరు ప్రఖ్యాతులు. లాక్ డౌన్ వేళ ఎంతోమంది సెలబ్రెటీలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. కానీ ఈ విషయంలో సోనూకు సాటి వచ్చేవాళ్లెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు.
నేనూ సాయం చేశా అని ప్రచారం చేసుకోవడానికో.. ఒక కంపల్షన్తోనో అతను విరాళాలు ఇవ్వలేదు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. నిజమైన తపనతో, మానవత్వంతో అతను స్పందించిన తీరు అందరినీ కదిలిస్తోంది. ముందుగా హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల కోసం తన హోటల్ను తెరిచి ఆహార పదార్థాలు అందించడంతో అతను వార్తల్లోకి వచ్చాడు.
ఐతే సోనూలోని మహా మనిషి బయటికి వచ్చింది మాత్రం వలస కార్మికుల కోసం చేసిన సేవతోనే. తమ సామానంతా నెత్తిన పెట్టుకుని పిల్లాపాపల్ని నడిపిస్తూ ఎండల్లో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న వారిని చూసి అతను కదిలిపోయాడు. వారి కోసం ప్రభుత్వ అనుమతులతో బస్సులు ఏర్పాటు చేశాడు. ముందు మూణ్నాలుగు బస్సులు ఏర్పాటు చేయగా.. అతడిని తర్వాత వందల మంది సంప్రదించారు. వాళ్లందరికీ అభయ హస్తం ఇచ్చి ప్రతి ఒక్కరినీ ఇంటికి చేర్చే బాధ్యత తీసుకున్నాడు.
ఒక దశ దాటాక ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు ప్రభుత్వ సాయం కోసం చూడకుండా సోనూకే తమ బాధ చెప్పుకున్నారు. సోషల్ మీడియాలోనూ అతడికి అభ్యర్థనలు చేశారు. ఐతే ఒక పరిమితి పెట్టుకోకుండా ఎంత మంది తన వద్దకొచ్చినా వాళ్లందరినీ ఇళ్లకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు సోనూ. ఇందుకోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కోట్ల రూపాయల డబ్బు ఇచ్చాడు. ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా ఇళ్లకు చేర్చాడు. దీంతో సోనూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడికి అందరూ సలాం కొడుతున్నారు.
This post was last modified on May 27, 2020 9:10 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…