కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు పునఃప్రారంభం అవుతున్నాయన్న సంకేతాలు రాగానే కొన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయిపోయాయి. వాటి గురించి ముందే ప్రకటనలు ఇచ్చి ప్రమోషన్లు జోరుగా చేశారు. కానీ ఈ శనివారం విడుదల కానున్న పాగల్ మూవీ మాత్రం సడెన్ సర్ప్రైజ్ లాగా దిగుతోంది. రిలీజ్ డేట్కు వారం కూడా లేని టైంలో ప్రకటన వచ్చింది. హడావుడిగా ప్రమోషన్లు చేశారు. బుధవారం ప్రి రిలీజ్ ఈవెంట్ సైతం లాగించేశారు. ఇంకో రెండు మూడు రోజులు ప్రమోషన్లు కొనసాగించి సినిమాను థియేటర్లలోకి వదులుతున్నారు.
దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సమర్పకుడిగా ఉన్న సినిమా విషయంలో ఇంత హడావుడి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి రాజు.. ఈ సినిమాను ఇలా రిలీజ్ చేయడానికి ఇష్టపడలేదట. కానీ ఈ చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ పట్టుబట్టి ఈ వారం సినిమా రిలీజయ్యేలా చేశాడట. ఈ విషయాన్ని ప్రి రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు.
పాగల్ సినిమా గురించి తన దగ్గర విశ్వక్సేన్ ఎప్పుడు మాట్లాడినా.. ఈ చిత్రం థియేటర్లలోనే కదా రిలీజయ్యేది అనే అడుగుతూ వచ్చాడని.. పరిస్థితిని బట్టి చూద్దామని తాను అన్నానని.. ఐతే ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాక కొత్త సినిమాలు బాగానే ఆడుతున్నాయని, గతవారం విడుదలైన ఓ సినిమాకు (ఎస్ఆర్ కళ్యాణమండపం) హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతూ మన సినిమాను తన దగ్గర విశ్వక్ చెబుతూ మన సినిమాను కూడా రిలీజ్ చేసేద్దామని అన్నాడని.. కానీ తాను కుదరదని చెప్పానని రాజు తెలిపాడు.
అన్నీ చూసుకుని రిలీజ్ చేద్దామని అంటే.. విశ్వక్ ఆగలేదని.. పట్టుబట్టి ఈ వారమే సినిమా రిలీజయ్యేలా చూశాడని.. అందుకోసం వారం రోజులు ఎంత కష్టపడాలో అంతా పడ్డాడని.. మొత్తం తనే చూసుకున్నాడని.. మిక్సింగ్ సహా ఇత్తర పనులు, ప్రమోషన్లు అన్నీ తనే చూసుకున్నాడని.. సినిమా పట్ల అతడి కమిట్మెంట్ తనకు చాలా నచ్చిందని దిల్ రాజు చెప్పాడు. పాగల్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని.. అలాగే కొంచెం హార్ట్ టచింగ్ సీన్లు కూడా ఇందులో ఉంటాయని దిల్ రాజు తెలిపాడు.
This post was last modified on August 12, 2021 10:27 am
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…
రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…
క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…
టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్…
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి…