ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా సంజయ్ లీలా బన్సాలీ పేరు చెప్పుకోవాలి. దర్శకుడిగా తొలి చిత్రం ‘హమ్ దిల్ కే చుకే సనమ్’తో మొదలుపెడితే.. దేవదాస్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్.. ఇలా ఆయన తీసిన మెజారిటీ సినిమాలు క్లాసిక్సే. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు క్లాసిక్ స్టేటస్ వస్తుంటుంది. పాతికేళ్ల కెరీర్లో ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఒక్కో సినిమాకు మూణ్నాలుగేళ్లు సమయం తీసుకుని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు.
‘పద్మావత్’ తర్వాత ఆయన సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయాలనుకున్నారు. కానీ అదెందుకో ముందుకు కదల్లేదు. తర్వాత ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడీ’ అనే గ్యాంగ్స్టర్ మూవీ తీశారు. అది విడుదలకు సిద్ధమైంది. బన్సాలీ కొత్త చిత్రం ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘హీరా మండి’ పేరుతో బన్సాలీ ఓ భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ తారలు నటిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దీన్ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్గా తీయాలని నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో వందల కోట్ల బడ్జెట్లో భారీగా ఈ సిరీస్ తీయడానికి అంగీకారం కుదిరింది.
భారత్కు స్వాతంత్ర్యం రావడానికి ముందు ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న లాహోర్లో ‘హీరామండి’ అనే ప్రాంతం చాలా ఫేమస్. దాని నేపథ్యంలో ఇప్పుడు బన్సాలీ సినిమా తీయబోతున్నారు. అంటే మనల్ని ఏడెనిమిది దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లబోతున్నాడన్నమాట. తన సినిమాలతో ఉండే రిస్క్ను మామూలుగా బన్సాలీ తనే భరిస్తుంటాడు. భారీ బడ్జెట్లో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీస్తుంటాడు. అయినా రాజీ అనేదే ఉండదు. ఐతే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ తోడవుతుండటంతో ఇంకా భారీగా, రాజీ లేకుండా ఈ సిరీస్ తీయడానికి అవకాశం లభించింది. ఇదొక ఎపిక్ సిరీస్ అవుతుందన్న అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on August 11, 2021 10:31 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…