ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా సంజయ్ లీలా బన్సాలీ పేరు చెప్పుకోవాలి. దర్శకుడిగా తొలి చిత్రం ‘హమ్ దిల్ కే చుకే సనమ్’తో మొదలుపెడితే.. దేవదాస్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్.. ఇలా ఆయన తీసిన మెజారిటీ సినిమాలు క్లాసిక్సే. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు క్లాసిక్ స్టేటస్ వస్తుంటుంది. పాతికేళ్ల కెరీర్లో ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఒక్కో సినిమాకు మూణ్నాలుగేళ్లు సమయం తీసుకుని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు.
‘పద్మావత్’ తర్వాత ఆయన సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయాలనుకున్నారు. కానీ అదెందుకో ముందుకు కదల్లేదు. తర్వాత ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడీ’ అనే గ్యాంగ్స్టర్ మూవీ తీశారు. అది విడుదలకు సిద్ధమైంది. బన్సాలీ కొత్త చిత్రం ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘హీరా మండి’ పేరుతో బన్సాలీ ఓ భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ తారలు నటిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దీన్ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్గా తీయాలని నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో వందల కోట్ల బడ్జెట్లో భారీగా ఈ సిరీస్ తీయడానికి అంగీకారం కుదిరింది.
భారత్కు స్వాతంత్ర్యం రావడానికి ముందు ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న లాహోర్లో ‘హీరామండి’ అనే ప్రాంతం చాలా ఫేమస్. దాని నేపథ్యంలో ఇప్పుడు బన్సాలీ సినిమా తీయబోతున్నారు. అంటే మనల్ని ఏడెనిమిది దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లబోతున్నాడన్నమాట. తన సినిమాలతో ఉండే రిస్క్ను మామూలుగా బన్సాలీ తనే భరిస్తుంటాడు. భారీ బడ్జెట్లో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీస్తుంటాడు. అయినా రాజీ అనేదే ఉండదు. ఐతే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ తోడవుతుండటంతో ఇంకా భారీగా, రాజీ లేకుండా ఈ సిరీస్ తీయడానికి అవకాశం లభించింది. ఇదొక ఎపిక్ సిరీస్ అవుతుందన్న అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on August 11, 2021 10:31 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…