కరోనా ధాటికి ఇండియాలో అత్యంత దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీ అంటే థియేటర్ రంగమే. గత ఏడాదిన్నరలో అటు ఇటుగా నాలుగైదు నెలలు మాత్రమే థియేటర్లు నడిచాయి. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఈ కాలంలో ఆదాయం లేకపోగా.. మెయింటైనెన్స్ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో థియేటర్ ఇండస్ట్రీపై ప్రభుత్వాలు కరుణ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత ఏడాది లాక్ డౌన్ కాలంలో ఏపీలోని థియేటర్లకు సంబంధించి నామమాత్రంగా కరెంటు బిల్లులను మాఫీ చేసింది తప్ప.. జగన్ సర్కారు ఆ ఇండస్ట్రీ నుంచి వస్తున్న విజ్ఞప్తులను మాత్రం పట్టించుకోవడం లేదు.
అప్పటికే ఉన్న రేట్లతో టికెట్లు అమ్మినా నష్టాలు పూడ్చుకోవడం కష్టం అంటుంటే.. దశాబ్దం కిందటి రేట్లకు సంబంధించిన జీవోలను బయటికి తీసి వాటిని అమలు చేయాలని అల్టిమేటం విధించడం పట్ల ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. టికెట్ల రేట్లు, ఇతర సమస్యల పై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం, నైట్ షోకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఏపీలో మెజారిటీ థియేటర్లు తెరుచుకోలేదు. ఉన్నవి నామమాత్రంగా నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ నేతృత్వంలో సినీ పెద్దలతో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఇందులో అదనపు షోలకు అనుమతులివ్వడం, విద్యుత్ బిల్లుల మాఫీ లాంటి పరిశ్రమ డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం ఈ ఇండస్ట్రీకి అండగా నిలిచే దిశగా సానుకూలంగా స్పందించినట్లే తెలుస్తోంది. ఇది తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఊరటనిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఇలా మద్దతు ఇస్తుంటే.. ఏపీ సర్కారు మాత్రం టికెట్ల రేట్ల విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తుండటం.. థియేటర్ ఇండస్ట్రీకి కోలుకునే అవకాశమే ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవతున్నాయి. మరి తెలంగాణలో పరిణామాలు చూశాక అయినా.. రాబోయే రోజుల్లోజగన్ సర్కారు తీరు మారుతుందేమో చూడాలి.
This post was last modified on August 11, 2021 8:44 am
ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…
ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం…
కొత్త సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ కు ఎలాంటి ఉత్సాహం కలగడం లేదు. కారణం కనీసం యావరేజ్ అనిపించుకున్నవి కూడా లేకపోవడమే.…
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. "సొంత చెల్లెలు కట్టుబొట్టుతో బాగుండాలని సగటు…
ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అదే.. పాన్ ఇండియా…
ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ…