సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆయన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి రిలీజైన టీజర్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులు కోరుకునే విధంగా మహేష్ ఇందులో కనిపించడం.. ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉండటం.. కలర్ ఫుల్ విజువల్స్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదరడంలో టీజర్ ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. మహేష్ అభిమానుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
ఐతే టీజర్ చూస్తే కథ మీద పెద్దగా ఐడియా రావట్లేదు. కేవలం కొన్ని మంచి మూమెంట్స్ మాత్రమే చూపించారు. ఐతే మహేష్ పాత్ర గురించి మాత్రం దర్శకుడు పరశురామ్ కాస్త హింట్ ఇచ్చాడు. అతను ఇందులో లోన్ రికవరీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లుగా అనిపిస్తోంది. విలన్ల దగ్గరికెళ్లి ఇంట్రెస్ట్ కట్టకపోతే బ్యాండే అని వార్నింగ్ ఇవ్వడం.. వాళ్లతో ఫైట్ చేయడం చూస్తే ఇదే సంకేతాలు కనిపిస్తున్నాయి. తర్వాత మహేష్ ఒక కార్పొరేట్ ఆఫీసులో పని చేస్తున్నట్లు కూడా చూపించారు. ఐతే లోన్ రికవరీ టీం అంటే మామూలుగా కొంచెం సాధారణ స్థాయిలోనే ఉంటుంది.
కానీ మహేష్ మాత్రం పోష్ లుక్స్లో కనిపిస్తున్నాడు. అతడి కారు, ఆఫీస్ అన్నీ కూడా హై రేంజిలో ఉన్నాయి. మరి ఈ పాత్రను ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ‘సర్కారు వారి పాట’ అని టైటిల్ పెట్టడం.. ఇందుమూలంగా అంటూ వేలం పాట సౌండ్ వినిపించడాన్ని బట్టి కథ అయితే బ్యాంకు-డబ్బు.. లాంటి వ్యవహారాల చుట్టూ తిరిగేలా ఉంది. ముందు అయితే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి తండ్రిని మోసం చేసిన వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకునే కొడుకు కథ ఇదన్నట్లు ప్రచారం జరిగింది. టీజర్లో అయితే అలాంటి సంకేతాలు కనిపించలేదు. సినిమా సీరియస్గా కాకుండా, పూర్తి ఎంటర్టైనింగ్గా ఉంటుందనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…