మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్టర్. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఒకరకంగా సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ ఇంకా బెటర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో కథలో భారీ మార్పులు ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ త్రివిక్రమ్ కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదట. కానీ కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ ను యాజిటీజ్ దించేసినట్లుగానే ఉంటుందట. కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ పెద్దగా మార్పులు చేయలేదట.
మెయిన్ స్టోరీను, అందులో క్యారెక్టరైజేషన్లను త్రివిక్రమ్ టచ్ చేయలేదట. దీని ప్రకారం సినిమాలో ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు మాత్రమే కనిపిస్తాయని.. అవి తప్ప మిగిలిన సినిమా మొత్తం కట్ కాపీ పేస్ట్ లా ఉంటుందని సమాచారం. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 6, 2021 7:54 pm
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…