మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్టర్. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఒకరకంగా సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ ఇంకా బెటర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో కథలో భారీ మార్పులు ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ త్రివిక్రమ్ కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదట. కానీ కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ ను యాజిటీజ్ దించేసినట్లుగానే ఉంటుందట. కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ పెద్దగా మార్పులు చేయలేదట.
మెయిన్ స్టోరీను, అందులో క్యారెక్టరైజేషన్లను త్రివిక్రమ్ టచ్ చేయలేదట. దీని ప్రకారం సినిమాలో ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు మాత్రమే కనిపిస్తాయని.. అవి తప్ప మిగిలిన సినిమా మొత్తం కట్ కాపీ పేస్ట్ లా ఉంటుందని సమాచారం. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 6, 2021 7:54 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…