మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్టర్. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఒకరకంగా సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ ఇంకా బెటర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో కథలో భారీ మార్పులు ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ త్రివిక్రమ్ కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదట. కానీ కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ ను యాజిటీజ్ దించేసినట్లుగానే ఉంటుందట. కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ పెద్దగా మార్పులు చేయలేదట.
మెయిన్ స్టోరీను, అందులో క్యారెక్టరైజేషన్లను త్రివిక్రమ్ టచ్ చేయలేదట. దీని ప్రకారం సినిమాలో ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు మాత్రమే కనిపిస్తాయని.. అవి తప్ప మిగిలిన సినిమా మొత్తం కట్ కాపీ పేస్ట్ లా ఉంటుందని సమాచారం. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 6, 2021 7:54 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…