మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్టర్. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఒకరకంగా సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ ఇంకా బెటర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో కథలో భారీ మార్పులు ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ త్రివిక్రమ్ కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదట. కానీ కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ ను యాజిటీజ్ దించేసినట్లుగానే ఉంటుందట. కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ పెద్దగా మార్పులు చేయలేదట.
మెయిన్ స్టోరీను, అందులో క్యారెక్టరైజేషన్లను త్రివిక్రమ్ టచ్ చేయలేదట. దీని ప్రకారం సినిమాలో ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు మాత్రమే కనిపిస్తాయని.. అవి తప్ప మిగిలిన సినిమా మొత్తం కట్ కాపీ పేస్ట్ లా ఉంటుందని సమాచారం. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 6, 2021 7:54 pm
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…