టాలీవుడ్లో యువ కథానాయకులు కలిసి తెరను పంచుకోవడం కొత్తేమీ కాదు. ఒకప్పుడైతే మల్టీస్టారర్లు చేయడానికి తటపటాయించేవాళ్లు కానీ.. గత దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు స్టార్లు కలిసి సినిమాలు చేశారు. పెద్ద స్టార్లే బేషజాలు పక్కన పెట్టి మల్టీస్టారర్లు చేస్తుంటే.. ఇక యువ కథానాయకులకు అభ్యంతరం ఏముంటుంది? టాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురేంటంటే.. మంచు మనోజ్ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట.
కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ విరామం తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన మంచు మనోజ్.. దాదాపు నాలుగేళ్ల నుంచి ఏ చిత్రాన్ని రిలీజ్ చేయని సంగతి తెలిసిందే. చివరగా 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ అనే డిజాస్టర్ మూవీతో పలకరించిన మనోజ్.. ఆ తర్వాత మూడేళ్లకు పైగా కెమెరానే ఫేస్ చేయలేదు. ఎట్టకేలకు గత ఏడాది ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టాడు మనోజ్.
సినిమా మొదలవడమే తెలుసు కానీ.. ఇప్పటిదాకా ‘అహం బ్రహ్మాస్మి’ గురించి కొత్త సమాచారం ఏమీ లేదు. అప్డేట్లు లేవు. ఐతే ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నట్లుగా ఇప్పుడు ప్రచారం సాగుతోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రనే అతను చేస్తున్నట్లు తెలుస్తోంది. మనోజ్కు, నరేష్కు మంచి అనుబంధమే ఉంది. దాదాపు ఒకే టైంలో ఇద్దరూ హీరోలయ్యారు. మొదట్నుంచి ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
మనోజ్, నరేష్ ఇద్దరూ కూడా గతంలో వేరే హీరోల సినిమాల్లో నటించిన వాళ్లే. కొన్నేళ్ల కిందటే నరేష్.. మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’లో కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ ఏడాదే అతను హీరోగా ‘నాంది’తో మంచి విజయాన్నందుకున్నాడు. ఇటీవలే ‘సభకు నమస్కారం’ అనే సినిమాను కూడా మొదలుపెట్టాడు. ‘వేదం’లో అల్లు అర్జున్తో స్క్రీన్ షేర్ చేసుకున్న మనోజ్.. కొన్ని చిత్రాల్లో క్యామియోలు చేశాడు. అతడి కెరీర్కు ఎంతో కీలకమైన ‘అహం బ్రహ్మస్మి’ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. మంచు మనోజ్ సంస్థ ఎంఎం ఆర్ట్స్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
This post was last modified on August 5, 2021 11:25 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…