తెలుగు సినీ సంగీత చరిత్రలో కీరవాణిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ రకమైన సినిమాకైనా సంగీతం అందించి మెప్పించగల అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరి లాగే ఆయన మాస్ సినిమాలకు మంచి ఊపున్న సంగీతం అందించగలరు. అదే సమయంలో ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక చిత్రానికీ తనదైన శైలిలో సంగీతం అందించగలరు. ఈ కోవకు చెందిన సినిమాలకు మిగతా సంగీత దర్శకులు పని చేయలేరు.
చాలా ఏళ్ల నుంచి కీరవాణి సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఆయన అంగీకరించట్లేదు. ఎక్కువగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ తన సోదరుడు రాజమౌళి చిత్రాలకే ఉపయోగిస్తున్నారాయన. మధ్యలో ఒకటీ అరా అన్నట్లుగా వేరే చిత్రాలకు పని చేస్తున్నారు. డిమాండుంది కదా అని ఎక్కువ సినిమాలు చేసి డబ్బులు పోగేసుకోవాలనే ఆశ ఆయనలో కనిపించడం లేదు.
ఐతే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం ఏమీ తక్కువ రావట్లేదు. సినిమాకు ఇంత అని పారితోషకం తీసుకోకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ కలిపి ఆయా చిత్రాలకు లాభాల్లో వాటా పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విజయవంతం అవుతుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి కుటుంబం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. కీరవాణి వాటా కింద ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం అందుతోందట.
ఓ భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషకం అంటే అనూహ్యమే. ఇది ఇండియాలోనే రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టాప్ సంగీత దర్శకులుగా పేరున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు రూ.3 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారు ఒక్కో చిత్రానికి. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రూ.5 కోట్ల దాకా తీసుకుంటాడంటారు. బాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ రేంజ్లోనే పుచ్చుకుంటారు. అలాంటిది కీరవాణికి రూ.18 కోట్లంటే అదో సంచలనమే.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…