తెలుగు సినీ సంగీత చరిత్రలో కీరవాణిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ రకమైన సినిమాకైనా సంగీతం అందించి మెప్పించగల అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరి లాగే ఆయన మాస్ సినిమాలకు మంచి ఊపున్న సంగీతం అందించగలరు. అదే సమయంలో ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక చిత్రానికీ తనదైన శైలిలో సంగీతం అందించగలరు. ఈ కోవకు చెందిన సినిమాలకు మిగతా సంగీత దర్శకులు పని చేయలేరు.
చాలా ఏళ్ల నుంచి కీరవాణి సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఆయన అంగీకరించట్లేదు. ఎక్కువగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ తన సోదరుడు రాజమౌళి చిత్రాలకే ఉపయోగిస్తున్నారాయన. మధ్యలో ఒకటీ అరా అన్నట్లుగా వేరే చిత్రాలకు పని చేస్తున్నారు. డిమాండుంది కదా అని ఎక్కువ సినిమాలు చేసి డబ్బులు పోగేసుకోవాలనే ఆశ ఆయనలో కనిపించడం లేదు.
ఐతే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం ఏమీ తక్కువ రావట్లేదు. సినిమాకు ఇంత అని పారితోషకం తీసుకోకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ కలిపి ఆయా చిత్రాలకు లాభాల్లో వాటా పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విజయవంతం అవుతుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి కుటుంబం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. కీరవాణి వాటా కింద ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం అందుతోందట.
ఓ భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషకం అంటే అనూహ్యమే. ఇది ఇండియాలోనే రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టాప్ సంగీత దర్శకులుగా పేరున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు రూ.3 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారు ఒక్కో చిత్రానికి. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రూ.5 కోట్ల దాకా తీసుకుంటాడంటారు. బాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ రేంజ్లోనే పుచ్చుకుంటారు. అలాంటిది కీరవాణికి రూ.18 కోట్లంటే అదో సంచలనమే.
This post was last modified on August 4, 2021 3:14 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…