Movie News

కీరవాణి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్

తెలుగు సినీ సంగీత చరిత్రలో కీరవాణిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ రకమైన సినిమాకైనా సంగీతం అందించి మెప్పించగల అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరి లాగే ఆయన మాస్ సినిమాలకు మంచి ఊపున్న సంగీతం అందించగలరు. అదే సమయంలో ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక చిత్రానికీ తనదైన శైలిలో సంగీతం అందించగలరు. ఈ కోవకు చెందిన సినిమాలకు మిగతా సంగీత దర్శకులు పని చేయలేరు.

చాలా ఏళ్ల నుంచి కీరవాణి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఆయన అంగీకరించట్లేదు. ఎక్కువగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ తన సోదరుడు రాజమౌళి చిత్రాలకే ఉపయోగిస్తున్నారాయన. మధ్యలో ఒకటీ అరా అన్నట్లుగా వేరే చిత్రాలకు పని చేస్తున్నారు. డిమాండుంది కదా అని ఎక్కువ సినిమాలు చేసి డబ్బులు పోగేసుకోవాలనే ఆశ ఆయనలో కనిపించడం లేదు.

ఐతే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం ఏమీ తక్కువ రావట్లేదు. సినిమాకు ఇంత అని పారితోషకం తీసుకోకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ కలిపి ఆయా చిత్రాలకు లాభాల్లో వాటా పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విజయవంతం అవుతుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి కుటుంబం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. కీరవాణి వాటా కింద ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం అందుతోందట.

ఓ భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషకం అంటే అనూహ్యమే. ఇది ఇండియాలోనే రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టాప్ సంగీత దర్శకులుగా పేరున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు రూ.3 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారు ఒక్కో చిత్రానికి. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రూ.5 కోట్ల దాకా తీసుకుంటాడంటారు. బాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ రేంజ్‌లోనే పుచ్చుకుంటారు. అలాంటిది కీరవాణికి రూ.18 కోట్లంటే అదో సంచలనమే.

This post was last modified on August 4, 2021 3:14 pm

Share

Recent Posts

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

4 minutes ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

13 minutes ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

5 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

6 hours ago