తెలుగు సినీ సంగీత చరిత్రలో కీరవాణిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ రకమైన సినిమాకైనా సంగీతం అందించి మెప్పించగల అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరి లాగే ఆయన మాస్ సినిమాలకు మంచి ఊపున్న సంగీతం అందించగలరు. అదే సమయంలో ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక చిత్రానికీ తనదైన శైలిలో సంగీతం అందించగలరు. ఈ కోవకు చెందిన సినిమాలకు మిగతా సంగీత దర్శకులు పని చేయలేరు.
చాలా ఏళ్ల నుంచి కీరవాణి సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఆయన అంగీకరించట్లేదు. ఎక్కువగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ తన సోదరుడు రాజమౌళి చిత్రాలకే ఉపయోగిస్తున్నారాయన. మధ్యలో ఒకటీ అరా అన్నట్లుగా వేరే చిత్రాలకు పని చేస్తున్నారు. డిమాండుంది కదా అని ఎక్కువ సినిమాలు చేసి డబ్బులు పోగేసుకోవాలనే ఆశ ఆయనలో కనిపించడం లేదు.
ఐతే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం ఏమీ తక్కువ రావట్లేదు. సినిమాకు ఇంత అని పారితోషకం తీసుకోకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ కలిపి ఆయా చిత్రాలకు లాభాల్లో వాటా పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విజయవంతం అవుతుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి కుటుంబం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. కీరవాణి వాటా కింద ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం అందుతోందట.
ఓ భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషకం అంటే అనూహ్యమే. ఇది ఇండియాలోనే రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టాప్ సంగీత దర్శకులుగా పేరున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు రూ.3 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారు ఒక్కో చిత్రానికి. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రూ.5 కోట్ల దాకా తీసుకుంటాడంటారు. బాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ రేంజ్లోనే పుచ్చుకుంటారు. అలాంటిది కీరవాణికి రూ.18 కోట్లంటే అదో సంచలనమే.
This post was last modified on August 4, 2021 3:14 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…