Movie News

తారక్ నుంచి 25 లక్షలు గెలిచిన చరణ్

నాలుగు సీజన్ల పాటు అలరించి.. అర్ధంతరంగా ఆగిపోయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో పున:ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ‘స్టార్ మా’ ఛానెల్లో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఈ షోను నడిపించగా.. ఇప్పుడు ‘జెమిని’ టీవీకి మారిన షోను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు. మరి కొన్ని రోజుల్లోనే షో మొదలు కాబోతోంది. తాజాగా ఒక ప్రోమో కూడా వదలడం.. అది ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే.

ఇక తొలి ఎపిసోడ్లో తారక్ ముందు ‘ఆర్ఆర్ఆర్’ కోస్టార్ రామ్ చరణ్ కూర్చోబోతున్నాడన్న సమాచారం కూడా బయటికి వచ్చింది. తారక్-చరణ్ కలిసి తొలి ఎపిసోడ్లో షోను రక్తి కట్టిస్తారనడంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ టీఆర్పీ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ గురించి మరింత ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.

ఫస్ట్ ఎపిసోడ్లో చరణ్.. తారక్ ప్రశ్నలకు బాగానే సమాధానం చెప్పాడని.. రూ.25 లక్షలు గెలిచాడని సమాచారం. తారక్ చేతుల మీదుగా ఆ చెక్కు అందుకుని మొత్తం డబ్బును ఛారిటీకి ఇచ్చేశాడట మెగా పవర్ స్టార్. ఇక ఈ షోను డైరెక్ట్ చేస్తున్నది దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల అన్న విషయం కూడా బయటికి వచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు చిత్రాలను రూపొందించిన కళ్యాణ్.. మూడేళ్లుగా ఏ సినిమా చేయలేదు. త్వరలోనే ‘బంగార్రాజు’ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.

ఆ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసి ఖాళీగా ఉన్న కళ్యాణ్.. మధ్యలో దొరికిన ఖాళీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ కొన్ని ఎపిసోడ్లను ఇప్పటికే పూర్తి చేసేశాడని.. మధ్యలో గ్యాప్ తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’ పాట చిత్రీకరణ కోసం యూరప్ వెళ్తున్నాడని.. ఆ తర్వాత మరి కొన్ని ఎపిసోడ్లు చేసి కొరటాల శివ సినిమాను మొదలుపెడతాడని సమాచారం.

This post was last modified on August 2, 2021 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

3 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

9 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

9 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 hours ago