విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడు. తమిళంలో అతడి మేనియా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. గత కొన్నేళ్లలో వేరే భాషల్లోకి కూడా అతడి క్రేజ్ విస్తరించింది. సేతుపతిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం.. లేదా తాము రాసిన పాత్రలకు సేతుపతే న్యాయం చేయగలడని అతడి కోసం ప్రయత్నించడం చేస్తున్నారు తెలుగు, ఇతర భాషల ఫిలిం మేకర్స్.
తెలుగులో ఇప్పటికే సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన సేతుపతిని ‘పుష్ప’లో కూడా నటింపజేయాలని చూశారు కానీ.. అప్పటికి డేట్లు సర్దుబాటు కాక ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు సేతుపతి. ఐతే తెలుగులో మరిందరు డైరెక్టర్లు సేతుపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తెలుగు చిత్రానికి సేతుపతి ఓకే అనేశాడట. అందులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరో అని అంటున్నారు.
సందీప్తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్-డీకే.. తెలుగులో ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారట. ఇంతకుముందు సందీప్తోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించారు రాజ్-డీకే. అది సరిగా ఆడలేదు. హిందీలో వీళ్లిద్దరూ రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’.. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్లో సందీప్ నటించాడు.
ఇప్పుడు సందీప్ హీరోగా వేరే నిర్మాతతో కలిసి తెలుగులో సినిమా తీయబోతున్నారట రాజ్-డీకే. భరత్ చౌదరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సందీప్కు విలన్గా విజయ్ సేతుపతి నటించనున్నాడట.
సినిమాలో హీరోను మించి హైలైట్ అయ్యేలా విలన్ పాత్ర ఉంటుందని.. దానికి సేతుపతి అయితేనే న్యాయం చేయగలడని అతణ్ని సంప్రదించారని.. తన పాత్ర నచ్చడంతో పాటు మంచి టీం కలిసి చేస్తున్న సినిమా కావడంతో అతను ఓకే అన్నాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on August 4, 2021 5:30 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…