తెలుగు సినిమా మరో ఉత్కంఠభరిత సందర్భం ముంగిట నిలిచింది. గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడి.. చివరికి డిసెంబర్లో పున:ప్రారంభం కావడం, చాలా వేగంగా పుంజుకుని వైభవాన్ని సంతరించుకోవడం తెలిసిందే. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఈ ఏడాది కూడా వేసవి మొదలవ్వగానే థియేటర్లు మూతపడ్డాయి.
మూడున్నర నెలల విరామం తర్వాత ఇప్పుడు పున:ప్రారంభం అవుతున్నాయి. ఈ శుక్రవారం నుంచే వెండితెరల్లో వెలుగులు కనిపించనున్నాయి. రీస్టార్ట్ మూవీస్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి తిమ్మరసు, ఇష్క్. లాక్ డౌన్ రావడానికి ముందే ఫస్ట్ కాపీలతో రెడీ అయిన ఈ చిత్రాలను.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇవి సెకండ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే కొత్త చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అంత ఆశాజనకంగా లేవు. ముందు థియేటర్లు తెరుచుకోనీ.. సినిమాలు రిలీజై టాక్ ఏంటో బయటికి రానీ అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో ఏమో కానీ.. అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదు. గత ఏడాది రీస్టార్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ విషయంలో ఇలా లేదు. ఆ సినిమా చూడ్డానికి ఎగబడ్డారు.
దానికి చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఐతే ఈసారి వస్తున్న చిత్రాల్లో స్టార్లు లేకపోవడానికి తోడు.. కరోనా సెకండ్ వేవ్తో జనాల్లో కలిగిన భయం కూడా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడానికి కారణం కావచ్చు. సెకండ్ వేవ్ తర్వాత మిగతా వ్యాపారాలు కూడా డల్లుగానే ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య ఓటీటీలకు ఇంకా ఎక్కువగా అలవాటు పడిపోయారు జనం.
ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలకు చాలా మంచి టాక్ వస్తేనే అవి బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. టాక్ బాగుంటే జనాలు ఆటోమేటిగ్గా వీకెండ్లో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. మరి శుక్రవారం మధ్యాహ్నం ఈ రెండు సినిమాల గురించి ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
This post was last modified on July 29, 2021 2:10 pm
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…