తెలుగు సినిమా మరో ఉత్కంఠభరిత సందర్భం ముంగిట నిలిచింది. గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడి.. చివరికి డిసెంబర్లో పున:ప్రారంభం కావడం, చాలా వేగంగా పుంజుకుని వైభవాన్ని సంతరించుకోవడం తెలిసిందే. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఈ ఏడాది కూడా వేసవి మొదలవ్వగానే థియేటర్లు మూతపడ్డాయి.
మూడున్నర నెలల విరామం తర్వాత ఇప్పుడు పున:ప్రారంభం అవుతున్నాయి. ఈ శుక్రవారం నుంచే వెండితెరల్లో వెలుగులు కనిపించనున్నాయి. రీస్టార్ట్ మూవీస్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి తిమ్మరసు, ఇష్క్. లాక్ డౌన్ రావడానికి ముందే ఫస్ట్ కాపీలతో రెడీ అయిన ఈ చిత్రాలను.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇవి సెకండ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే కొత్త చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అంత ఆశాజనకంగా లేవు. ముందు థియేటర్లు తెరుచుకోనీ.. సినిమాలు రిలీజై టాక్ ఏంటో బయటికి రానీ అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో ఏమో కానీ.. అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదు. గత ఏడాది రీస్టార్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ విషయంలో ఇలా లేదు. ఆ సినిమా చూడ్డానికి ఎగబడ్డారు.
దానికి చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఐతే ఈసారి వస్తున్న చిత్రాల్లో స్టార్లు లేకపోవడానికి తోడు.. కరోనా సెకండ్ వేవ్తో జనాల్లో కలిగిన భయం కూడా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడానికి కారణం కావచ్చు. సెకండ్ వేవ్ తర్వాత మిగతా వ్యాపారాలు కూడా డల్లుగానే ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య ఓటీటీలకు ఇంకా ఎక్కువగా అలవాటు పడిపోయారు జనం.
ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలకు చాలా మంచి టాక్ వస్తేనే అవి బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. టాక్ బాగుంటే జనాలు ఆటోమేటిగ్గా వీకెండ్లో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. మరి శుక్రవారం మధ్యాహ్నం ఈ రెండు సినిమాల గురించి ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
This post was last modified on July 29, 2021 2:10 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…