మిమి.. ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం. తెలుగులో ‘1 నేనొక్కడే’, ‘దోచేయ్’ సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిలైపోయిన కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ మూవీ ఇది. సరోగసీ ద్వారా ఓ విదేశీ జంట కోసం బిడ్డను కనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుని.. వాళ్లు మధ్యలో డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక సతమతం అయ్యే మధ్య తరగతి అమ్మాయి కథ ఇది. దీని ట్రైలర్ భలే ఎంటర్టైనింగ్గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇక నాలుగు రోజుల్లో రిలీజ్ అనగా సినిమా మొత్తం ఆన్ లైన్లో లీక్ అయిపోవడం సంచలనం రేపింది. ఐతే ఆలస్యం చేయకుండా నెట్ ఫ్లిక్స్ వాళ్లు సినిమా లీక్ అయిన సోమవారం నాడే దీన్ని స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. సినిమా చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా ‘మిమి’ని చెబుతున్నారు. కృతికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అని అంటున్నారు.
ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘మిమి’ కాన్సెప్ట్తో ఎనిమిదేళ్ల కిందటే తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాను రూపొందించింది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కావడం విశేషం. ఆ చిత్రం పేరు.. వెల్కమ్ ఒబామా. అందరూ కొత్త వాళ్లు నటించారు ఆ సినిమాలో. ఐతే అదేమీ ఒరిజినల్ మూవీ కాదు. దానికి ‘మల ఆయ్ వచాయ్’ అనే మరాఠీ చిత్రం ఆధారం. ఐతే ఈ మరాఠా మూవీ, అలాగే ‘వెల్కమ్ ఒబామా’ చాలా సీరియస్గా, ఎమోషనల్గా సాగుతాయి.
కానీ ‘మిమి’ని ఎక్కువ ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ను ఉన్నదున్నట్లు దించేయకుండా దానికి వినోదపు పూత పూశారు. ఇంకా గ్రాండ్గా తీర్చిదిద్దారు. అది ప్రేక్షకులకు బాగానే నచ్చుతున్నట్లుంది. ‘వెల్కమ్ ఒబామా’ విషయానికి వస్తే.. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు పెద్దగా తెలియదు. సింగీతం చాలా ఏళ్ల ముందే ఫామ్ కోల్పోవడం, ఇందులోని ఆర్టిస్లులు జనాలకు పెద్దగా తెలియకపోవడంతో సినిమా జనాలకు తెలియకుండానే కనుమరుగైపోయింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…