మిమి.. ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం. తెలుగులో ‘1 నేనొక్కడే’, ‘దోచేయ్’ సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిలైపోయిన కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ మూవీ ఇది. సరోగసీ ద్వారా ఓ విదేశీ జంట కోసం బిడ్డను కనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుని.. వాళ్లు మధ్యలో డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక సతమతం అయ్యే మధ్య తరగతి అమ్మాయి కథ ఇది. దీని ట్రైలర్ భలే ఎంటర్టైనింగ్గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇక నాలుగు రోజుల్లో రిలీజ్ అనగా సినిమా మొత్తం ఆన్ లైన్లో లీక్ అయిపోవడం సంచలనం రేపింది. ఐతే ఆలస్యం చేయకుండా నెట్ ఫ్లిక్స్ వాళ్లు సినిమా లీక్ అయిన సోమవారం నాడే దీన్ని స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. సినిమా చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా ‘మిమి’ని చెబుతున్నారు. కృతికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అని అంటున్నారు.
ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘మిమి’ కాన్సెప్ట్తో ఎనిమిదేళ్ల కిందటే తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాను రూపొందించింది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కావడం విశేషం. ఆ చిత్రం పేరు.. వెల్కమ్ ఒబామా. అందరూ కొత్త వాళ్లు నటించారు ఆ సినిమాలో. ఐతే అదేమీ ఒరిజినల్ మూవీ కాదు. దానికి ‘మల ఆయ్ వచాయ్’ అనే మరాఠీ చిత్రం ఆధారం. ఐతే ఈ మరాఠా మూవీ, అలాగే ‘వెల్కమ్ ఒబామా’ చాలా సీరియస్గా, ఎమోషనల్గా సాగుతాయి.
కానీ ‘మిమి’ని ఎక్కువ ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ను ఉన్నదున్నట్లు దించేయకుండా దానికి వినోదపు పూత పూశారు. ఇంకా గ్రాండ్గా తీర్చిదిద్దారు. అది ప్రేక్షకులకు బాగానే నచ్చుతున్నట్లుంది. ‘వెల్కమ్ ఒబామా’ విషయానికి వస్తే.. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు పెద్దగా తెలియదు. సింగీతం చాలా ఏళ్ల ముందే ఫామ్ కోల్పోవడం, ఇందులోని ఆర్టిస్లులు జనాలకు పెద్దగా తెలియకపోవడంతో సినిమా జనాలకు తెలియకుండానే కనుమరుగైపోయింది.
This post was last modified on July 28, 2021 3:13 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…