ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడం.. పైగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ముందు నుంచే అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ మధ్య రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడిక ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజికల్ బొనాంజాతో అంచనాలు ఇంకా పెంచడానికి సిద్ధమైంది కీరవాణి బృందం.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఆడియో హక్కులను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక రేటుకు టీ సిరీస్-లహరి వాళ్లకు అమ్మడం తెలిసిందే. సినిమా నుంచి ఇక ఒక్కో పాట రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు జరుతున్నాయి. తొలి పాటకు ముహూర్తం కూడా కుదిరింది. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు.
ఈ పాట గురించి అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. ఆ ఫొటోలో ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బాలీవుడ్ మ్యుజీషియన్ అమిత్ త్రివేదిలతో పాటు గాయకులు హేమచంద్ర, విజయ్ ఏసుదాస్, యాజిన్ నజీర్ ఉన్నారు. ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు, ముగ్గురు మంచి గాయకులు కలిసి ఈ పాట కోసం పని చేశారంటే ఇది మామూలుగా ఉండదనే అంచనాలు కలుగుతున్నాయి.
మరి కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ సాంగే ఇదా.. లేక వేరే పాటనా అన్నది తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసే ప్రోమో వీడియోల్లో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ వారెవా అనిపించింది. మరి పాటల్లో ఆయన పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13న విడుదలయ్యే అవకాశముంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…