పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనివార్య పరిస్థితుల్లో మరోసారి పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. లాక్ డౌన్ అమల్లోకి రావడం, తనకు కరోనా సోకడంతో దాదాపు నాలుగు నెలల పాటు పైగా పవన్ షూటింగ్కు దూరంగా ఉన్నాడు. గత నెలలోనే టాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం కాగా.. పవన్ మాత్రం సెట్లోకి రావడానికి టైం తీసుకున్నాడు.
ఈ నెల 12నే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పని పున:ప్రారంభిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అది సాధ్యం కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ రోజు, అంటే సోమవారం పవన్ మళ్లీ కెమెరా ఫేస్ చేశాడు.
ఈ రోజే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పున:ప్రారంభం అయింది. పవన్ ఇలా సెట్లోకి అడుగు పెట్టాడని సమాచారం బయటికి వచ్చిందో లేదో.. ‘పీఎస్పీకే-రానా మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవడం మొదలైంది. చూస్తుండగానే ఇండియా లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. ముందుగా పవన్ సెట్లో నడిచి వస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది.
తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్వయంగా ఆన్ లొకేషన్ ఫొటో ఒకటి రిలీజ్ చేసింది. పవన్ పోలీస్ డ్రెస్లో ఉన్న ఫొటో అది. పవన్ ముఖం కనిపించకుండా వెనుక నుంచి తీసిన ఈ ఫొటోను షేర్ చేస్తూ పవన్ పాత్ర పేరును వెల్లడిస్తూ అప్డేట్ ఇచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్.
ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్గా కనిపించనున్నాడట. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పాత్రను ఇందులో పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆ పాత్రధారి ఓ గిరిజిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ హీరోనే గిరిజినుడిగా చూపిస్తున్నారన్నమాట. ఒక స్టార్ హీరో.. హీరోయిజం ఉన్న పాత్ర చేస్తూ ఇలాంటి పేరు పెట్టుకోవడం టాలీవుడ్లో అరుదే.
పవన్కు ఇది ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇందులో పవన్కు జోడీగా నిత్యా మీనన్ ఎంపికైన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్లో ఆమె కూడా పాల్గొంటోంది. రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2021 1:34 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…