మామూలుగానే ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక రిలీజ్ దగ్గర పడేకొద్దీ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అందుక్కారణం రాజమౌళి అండ్ టీం అమలు చేస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీనే. ఇటీవలే ఎవ్వరూ ఊహించని విధంగా ఉన్నట్లుండి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది ఆర్ఆర్ఆర్ టీం.
అది కళ్లు చెదిరే విధంగా ఉండి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడిక ఒక భారీ ప్రమోషనల్ సాంగ్ కోసం సన్నాహాలు చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. హీరోలతో పాటుగా చిత్ర బృందంలోని ముఖ్యులందరూ కనిపించే ఈ ప్రమోషనల్ సాంగ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నభూతో అనేట్లు ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం సంగీత దర్శకుడు కీరవాణి.. తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సాయం తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషనల్ సాంగ్కు సంగీత పరంగా సాయం చేయడంతో పాటు ఇందులో అనిరుధ్ సైతం తళుక్కుమంటాడని ప్రచారం సాగింది. ఈ ప్రచారం నిజమే అని తేలింది. స్వయంగా కీరవాణే దీని గురించి అప్డేట్ ఇచ్చాడు. ఆయన చెన్నైకి వెళ్లి అనిరుధ్ను కలిసి ఈ పాట గురించి చర్చించి రావడం విశేషం.
ఈ సందర్భంగా అనిరుధ్ టాలెంట్, అతడి టీం గురించి ప్రశంసలు కురిపిస్తూ కీరవాణి ఒక ట్వీట్ కూడా వేశాడు. అనిరుధ్తో తన సెషన్ చాలా బాగా సాగిందనడం ద్వారా ప్రమోషనల్ సాంగ్ గురించి కీరవాణి హింట్ ఇచ్చాడు. ఇందుకు అనిరుధ్ స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్లో భాగం కావడం తనకెంతో ఆనందదాయకమని.. టీంకు తన ప్రేమాభిమానాలు అందజేస్తున్నానని ట్వీట్ చేశాడు.
యూత్, మాస్, ఫ్యాన్స్ పల్స్ బాగా తెలిసిన అనిరుధ్.. తన పాటలతో ఎలా అలరిస్తాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం అంటే అతను ఓ రేంజిలో ఔట్పుట్ ఇస్తాడని ఆశించవచ్చు.
This post was last modified on July 26, 2021 8:23 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…