2000 తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అత్యుత్తమ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాని పేరు ముందు వరుసలో ఉంటుంది. మున్నాబాయ్ ఎంబీబీఎస్.. మున్నాబాయ్ లగేరహో.. 3 ఇడిటయ్స్.. పీకే.. సంజు.. ఇలా ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక క్లాసిక్కే.
‘సంజు’ తర్వాత మున్నాబాయ్ సిరీస్లో మూడో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న షారుఖ్ ఖాన్తో సినిమాకు ఓకే చెప్పాడు హిరాని. ఈ మెగా కాంబినేషన్ అంచనాలు మామూలుగా లేవు.
సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకున్న పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకునే హిరాని.. షారుఖ్ సినిమాకు కూడా చాలానే టైం తీసుకుంటున్నాడు. ‘జీరో’ తర్వాత తన రీఎంట్రీ మూవీ ‘పఠాన్’ పనిలో షారుఖ్ బిజీగా ఉండగా.. అది పూర్తి కాగానే, ఈ ఏడాది చివర్లో హిరాని సినిమాను పట్టాలెక్కిస్తాడని భావిస్తున్నారు.
ఈ సినిమాలో షారుఖ్తో పాటుగా నటించబోయే కాస్టింగ్ గురించి బాలీవుడ్లో వస్తున్న వార్తలు అభిమానులను ఎగ్జైట్ చేస్తున్నాయి. షారుఖ్తో ఎవర్ గ్రీన్ జోడీగా పేరున్న కాజోల్ ఇందులో కీలక పాత్ర పోషించనుందట. అలాగే యాక్టింగ్ పవర్ హౌస్లుగా పేరున్న మనోజ్ బాజ్పేయి, బొమన్ ఇరానీ, విద్యాబాలన్, తాప్సి.. ఈ నలుగురూ ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారట.
షారుఖ్తో మొదలుకుని ఈ ఆరుగురిలో ఎవరికి వాళ్లు గ్రేట్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఇంత మంది ఫేమస్ ఆర్టిస్లులతో కలిసి హిరాని లాంటి గ్రేట్ డైరెక్టర్ సినిమా చేయబోతుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇంకా ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఎవరన్నది ఖరారవ్వలేదు. మంచి సందేశం ఉన్న కథల్ని వినోదాత్మకంగా చెప్పడంలో హిరానిది అందె వేసిన చేయి. మరి షారుఖ్తో కూడా తనదైన శైలిలో సినిమా తీసి అతడి బ్లాక్బస్టర్ కరవును తీరుస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2021 9:00 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…