2000 తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అత్యుత్తమ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాని పేరు ముందు వరుసలో ఉంటుంది. మున్నాబాయ్ ఎంబీబీఎస్.. మున్నాబాయ్ లగేరహో.. 3 ఇడిటయ్స్.. పీకే.. సంజు.. ఇలా ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక క్లాసిక్కే.
‘సంజు’ తర్వాత మున్నాబాయ్ సిరీస్లో మూడో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న షారుఖ్ ఖాన్తో సినిమాకు ఓకే చెప్పాడు హిరాని. ఈ మెగా కాంబినేషన్ అంచనాలు మామూలుగా లేవు.
సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకున్న పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకునే హిరాని.. షారుఖ్ సినిమాకు కూడా చాలానే టైం తీసుకుంటున్నాడు. ‘జీరో’ తర్వాత తన రీఎంట్రీ మూవీ ‘పఠాన్’ పనిలో షారుఖ్ బిజీగా ఉండగా.. అది పూర్తి కాగానే, ఈ ఏడాది చివర్లో హిరాని సినిమాను పట్టాలెక్కిస్తాడని భావిస్తున్నారు.
ఈ సినిమాలో షారుఖ్తో పాటుగా నటించబోయే కాస్టింగ్ గురించి బాలీవుడ్లో వస్తున్న వార్తలు అభిమానులను ఎగ్జైట్ చేస్తున్నాయి. షారుఖ్తో ఎవర్ గ్రీన్ జోడీగా పేరున్న కాజోల్ ఇందులో కీలక పాత్ర పోషించనుందట. అలాగే యాక్టింగ్ పవర్ హౌస్లుగా పేరున్న మనోజ్ బాజ్పేయి, బొమన్ ఇరానీ, విద్యాబాలన్, తాప్సి.. ఈ నలుగురూ ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారట.
షారుఖ్తో మొదలుకుని ఈ ఆరుగురిలో ఎవరికి వాళ్లు గ్రేట్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఇంత మంది ఫేమస్ ఆర్టిస్లులతో కలిసి హిరాని లాంటి గ్రేట్ డైరెక్టర్ సినిమా చేయబోతుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇంకా ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఎవరన్నది ఖరారవ్వలేదు. మంచి సందేశం ఉన్న కథల్ని వినోదాత్మకంగా చెప్పడంలో హిరానిది అందె వేసిన చేయి. మరి షారుఖ్తో కూడా తనదైన శైలిలో సినిమా తీసి అతడి బ్లాక్బస్టర్ కరవును తీరుస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2021 9:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…