ఒక్కోసారి కొన్ని హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ వస్తుంటుంది. లోకల్ సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా అవి బంపర్ క్రేజ్ మధ్య రిలీజవుతుంటాయి. కలెక్షన్ల మోత మోగిస్తుంటాయి. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. దీని తర్వాత అంత క్రేజ్ సంపాదించుకుని భారతీయ బాక్సాఫీస్ను రూల్ చేసిన హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’.
ఈ ఏడాది మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. పెద్ద సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్తో రన్ అయిందీ సినిమా. సింగిల్ స్క్రీన్లలో కూడా బాగానే ఆడింది. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు డిజిటల్ రిలీజ్ కోసం చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐతే ఎట్టకేలకు ఆ చిత్రం ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్ ఆగస్టు 14న ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను రిలీజ్ చేయబోతోంది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తోంది ప్రైమ్. ఇది ప్రైమ్ సబ్స్క్రైబర్లకు సూపర్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ఐతే ఈ చిత్రంపై ఉన్న అంచనాల దృష్ట్యా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తారని ముందు ప్రచారం జరిగింది.
ఐతే థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తూ పెయిడ్ స్క్రీనింగ్ అంటే టూమచ్ అవుతుంది. ప్రైమ్ అనౌన్స్మెంట్లో మాత్రం పే పవర్ వ్యూ గురించి ప్రస్తావన ఏమీ లేదు. ఓవైపు గాడ్జిల్లా, మరోవైపు కింగ్ కాంగ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇవి రెండూ ఒకదాంతో ఒకటి తలపడ్డ సినిమా ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఇందులో ద్వితీయార్ధంలో యాక్షన్ ఘట్టాలు నభూతో నభవిష్యత్ అంటూ అందరూ కొనియాడారు. వెండితెరలపై గొప్పగా అలరించిన ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులనూ మైమరిపిస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 23, 2021 1:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…