మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకున్నపుడు ఎంచుకున్నది రీమేక్నే. తర్వాత సైరా సినిమాలో నటించి, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు.. మళ్లీ రీమేక్ బాట పట్టనున్నాడు. ఆయన కోసం తనయుడు రామ్ చరణ్ మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఐతే మలయాళం నుంచి ఉన్నదున్నట్లు దించేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు ఏవో చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే మూల కథ, పాత్రలు మాత్రం మారే అవకాశం లేదు. అదనంగా కొన్ని పాత్రలు తోడు కావచ్చు.
లూసిఫర్ సినిమాలో ఒక ప్రాధాన్యమున్న లేడీ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడ ఆ పాత్రను మంజు వారియర్ చేసింది. తెలుగులో ఆ పాత్రను విజయశాంతితో చేయించాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు సెలవు అంటూ వెళ్లిపోయింది. ఆమెను ఎవరూ అడగట్లేదా.. తనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియడం లేదు.
ఇలాంటి తరుణంలో చిరు, సుజీత్.. మంజు పాత్ర కోసం విజయశాంతిని అడుగుతున్నారని.. ఆమె ఓకే చెప్పే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిలేరు ఈవెంట్లోనే విజయశాంతితో చాలా ఆత్మీయంగా మాట్లాడారు చిరు. అప్పుడు వాళ్ల కెమిస్ట్రీ పట్ల ఆసక్తికర చర్చ జరిగింది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ జోడీ.. మళ్లీ తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…