వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంత పేరున్న వ్యక్తికి ఇదేం బుద్ధి అంటూ జనాలు ఆశ్చర్యపోయారు. లండన్ కేంద్రంగా నడిచే ఓ సంస్థ ద్వారా నిధులు అందుకుని ఔత్సాహిక మోడల్స్ను బలవంతం చేసి అశ్లీల చిత్రాలు తీసి, ఓ యాప్ ద్వారా రిలీజ్ చేసి కోట్లు గడిస్తున్నాడన్నది కుంద్రా మీద వచ్చిన ఆరోపణ.
ఈ కేసులో కుంద్రాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలే ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ కేసు విషయంలో కుంద్రా వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరం. అతడి లాయర్ కేసుకు సంబంధించి తమ వాదనను కోర్టులో వినిపించాడు కూడా. దాని ప్రకారం తాము తీసింది వెబ్ సిరీస్లే తప్ప పోర్న్ చిత్రాలు కాదన్నది కుంద్రా వాదన.
“ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్సిరీస్లను చూస్తే వాటిల్లో ఎక్కువగా ఇంటిమేట్ సీన్లు ఉంటున్నాయి. అదే మాదిరిగా ఇది కూడా ఓ వెబ్సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిల్మ్ కాదు. మనకున్న సెక్షన్ల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తేనే దాన్ని పోర్న్ కింద వర్గీకరించాలి. అలా కాకుండా ఏ ఇతర అశ్లీల సన్నివేశాలను పోర్న్ కింద పరిగణించాల్సిన అవసరం లేదు” అని రాజ్కుంద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మొత్తానికి తాము శృంగార పరమైన వీడియోలు తీస్తున్న సంగతి మాత్రం రాజ్ కుంద్రా అంగీకరిస్తున్నట్లే ఉంది. కాకపోతే అవి పోర్న్ కిందికి రావన్నది అతడి వాదన. మరి పోలీసులు, కోర్టు ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాయో చూడాలి.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారు.
This post was last modified on July 22, 2021 5:49 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…