రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త నచ్చిందంటే దాని గురించి ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. మరీ అతిశయోక్తులు జోడించి పొగడ్డం ద్వారా జనాలకు అసలు నిజంగా ఇందులో విషయం ఉందా అనే సందేహాలు కలిగిస్తుంటారు. ఇక తన శిష్యుడు, తనకు అత్యంత సన్నిహితు పూరి జగన్నాథ్ ఏం చేసినా ఆహా ఓహో అనేయడం మామూలే. ఒకప్పుడు అయితే వర్మ మాటలను అందరూ పట్టించుకునేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో ఆయన మాటలకు విలువే లేకుండా పోయింది.
గతంలో పూరి తీసిన లోఫర్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి వర్మ ఎంత గొప్పగా ట్వీట్లు వేశాడో గుర్తుండే ఉంటుంది. తన జీవితంలో అలాంటి మదర్ సెంటిమెంట్ మూవీనే చూడలేదని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేశాడు. తీరా చూస్తే వర్మ మాటలకు, వాస్తవానికి పొంతనే లేకుండా పోయింది.
ఇప్పుడు మరోసారి తన శిష్యుడి సినిమా గురించి వర్మ ఊకదంపుడు ట్వీట్లు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీస్తున్న లైగర్ సినిమాకు సంబంధించి రషెస్ ఏవో చూశాడట వర్మ. ఇక దాని గురించి పొగడ్తలు మామూలుగా లేవు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే.. గత రెండు దశాబ్దాల్లో మరే స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేదని అన్నాడు వర్మ.
ఇక ఇందులో కొన్ని సీన్లు చూస్తే.. విజయ్ సింహానికి, పులికి క్రాస్ చేస్తే వచ్చిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్లను క్రాస్ చేస్తే ఎలా ఉంటాడో అలా కనిపించాడని.. ఇలాంటి సినిమాను రూపొందించిన పూరికి, నిర్మించిన ఛార్మికి చాలా థ్యాంక్స్ అని ఒక రేంజిలో పొగిడేశాడు వర్మ. ఈ కామెంట్ల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏమో కానీ… గత అనుభవాల దృష్ట్యా చేటే ఎక్కువేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…