రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త నచ్చిందంటే దాని గురించి ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. మరీ అతిశయోక్తులు జోడించి పొగడ్డం ద్వారా జనాలకు అసలు నిజంగా ఇందులో విషయం ఉందా అనే సందేహాలు కలిగిస్తుంటారు. ఇక తన శిష్యుడు, తనకు అత్యంత సన్నిహితు పూరి జగన్నాథ్ ఏం చేసినా ఆహా ఓహో అనేయడం మామూలే. ఒకప్పుడు అయితే వర్మ మాటలను అందరూ పట్టించుకునేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో ఆయన మాటలకు విలువే లేకుండా పోయింది.
గతంలో పూరి తీసిన లోఫర్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి వర్మ ఎంత గొప్పగా ట్వీట్లు వేశాడో గుర్తుండే ఉంటుంది. తన జీవితంలో అలాంటి మదర్ సెంటిమెంట్ మూవీనే చూడలేదని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేశాడు. తీరా చూస్తే వర్మ మాటలకు, వాస్తవానికి పొంతనే లేకుండా పోయింది.
ఇప్పుడు మరోసారి తన శిష్యుడి సినిమా గురించి వర్మ ఊకదంపుడు ట్వీట్లు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీస్తున్న లైగర్ సినిమాకు సంబంధించి రషెస్ ఏవో చూశాడట వర్మ. ఇక దాని గురించి పొగడ్తలు మామూలుగా లేవు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే.. గత రెండు దశాబ్దాల్లో మరే స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేదని అన్నాడు వర్మ.
ఇక ఇందులో కొన్ని సీన్లు చూస్తే.. విజయ్ సింహానికి, పులికి క్రాస్ చేస్తే వచ్చిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్లను క్రాస్ చేస్తే ఎలా ఉంటాడో అలా కనిపించాడని.. ఇలాంటి సినిమాను రూపొందించిన పూరికి, నిర్మించిన ఛార్మికి చాలా థ్యాంక్స్ అని ఒక రేంజిలో పొగిడేశాడు వర్మ. ఈ కామెంట్ల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏమో కానీ… గత అనుభవాల దృష్ట్యా చేటే ఎక్కువేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on July 20, 2021 11:15 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…