రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త నచ్చిందంటే దాని గురించి ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. మరీ అతిశయోక్తులు జోడించి పొగడ్డం ద్వారా జనాలకు అసలు నిజంగా ఇందులో విషయం ఉందా అనే సందేహాలు కలిగిస్తుంటారు. ఇక తన శిష్యుడు, తనకు అత్యంత సన్నిహితు పూరి జగన్నాథ్ ఏం చేసినా ఆహా ఓహో అనేయడం మామూలే. ఒకప్పుడు అయితే వర్మ మాటలను అందరూ పట్టించుకునేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో ఆయన మాటలకు విలువే లేకుండా పోయింది.
గతంలో పూరి తీసిన లోఫర్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి వర్మ ఎంత గొప్పగా ట్వీట్లు వేశాడో గుర్తుండే ఉంటుంది. తన జీవితంలో అలాంటి మదర్ సెంటిమెంట్ మూవీనే చూడలేదని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేశాడు. తీరా చూస్తే వర్మ మాటలకు, వాస్తవానికి పొంతనే లేకుండా పోయింది.
ఇప్పుడు మరోసారి తన శిష్యుడి సినిమా గురించి వర్మ ఊకదంపుడు ట్వీట్లు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీస్తున్న లైగర్ సినిమాకు సంబంధించి రషెస్ ఏవో చూశాడట వర్మ. ఇక దాని గురించి పొగడ్తలు మామూలుగా లేవు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే.. గత రెండు దశాబ్దాల్లో మరే స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేదని అన్నాడు వర్మ.
ఇక ఇందులో కొన్ని సీన్లు చూస్తే.. విజయ్ సింహానికి, పులికి క్రాస్ చేస్తే వచ్చిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్లను క్రాస్ చేస్తే ఎలా ఉంటాడో అలా కనిపించాడని.. ఇలాంటి సినిమాను రూపొందించిన పూరికి, నిర్మించిన ఛార్మికి చాలా థ్యాంక్స్ అని ఒక రేంజిలో పొగిడేశాడు వర్మ. ఈ కామెంట్ల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏమో కానీ… గత అనుభవాల దృష్ట్యా చేటే ఎక్కువేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on July 20, 2021 11:15 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…