టాలీవుడ్ దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒక రకమైన దర్శకుడు. పూర్తిగా తాను పుట్టి పెరిగిన ప్రాంతం నేపథ్యంలో సినిమాలు తీసే అతను.. ఎక్కువగా హైదరాబాద్లో కూడా ఉండడు. సినిమా చేసినన్ని రోజులు ఇక్కడుండి మళ్లీ తమ ప్రాంతానికి వెళ్లి మామూలు జీవితం గడుపుతుంటాడు.
మళ్లీ తన అనుభవాలను మూటగట్టుకుని వచ్చి ఇక్కడ సినిమా తీస్తుంటాడు. ఐతే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో యువ, కుటుంబ ప్రేక్షకుల మనసు దోచిన శ్రీకాంత్కు ఆ తర్వాతి రెండు సినిమాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. ‘ముకుంద’ ప్రేక్షకులను మెప్పించకపోగా.. ‘బ్రహ్మాత్సవం’ అవమాన భారాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు అడ్డాల. చివరికి రీమేక్ మూవీ అయిన ‘నారప్ప’తో అతను రీఎంట్రీ ఇస్తున్నాడు.
శ్రీకాంత్ ఏంటి రీమేక్ ఏంటి.. పైగా సున్నితమైన సినిమాలు చేసే అతను ఇంత వయొలెంట్ మూవీని డైరెక్ట్ చేయడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ పునరాగమనానికి ఏదో ఒక దారి కోసం చూస్తున్న అతను.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లున్నాడు. ఐతే ‘నారప్ప’ తర్వాత ఏంటి అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. దీనికి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. ‘అన్నాయ్’ పేరుతో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్లు తెలిపాడు.
గుంటూరు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ చిత్రం అని అతను వెల్లడించడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో ఈ సినిమా చేయనున్నాడట శ్రీకాంత్. ఐతే దీనికి హీరో ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదట. శ్రీకాంత్ రీఎంట్రీ మూవీ గీతా బేనర్లోనే అని రెండేళ్ల కిందటే ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కకముందే ‘నారప్ప’లో ఛాన్స్ వచ్చింది. మరి శ్రీకాంత్ను నమ్మి ట్రయాలజీ యాక్షన్ ఫిలింలో చేసే హీరో ఎవరో చూడాలి.
This post was last modified on July 18, 2021 6:13 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…