టాలీవుడ్ దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒక రకమైన దర్శకుడు. పూర్తిగా తాను పుట్టి పెరిగిన ప్రాంతం నేపథ్యంలో సినిమాలు తీసే అతను.. ఎక్కువగా హైదరాబాద్లో కూడా ఉండడు. సినిమా చేసినన్ని రోజులు ఇక్కడుండి మళ్లీ తమ ప్రాంతానికి వెళ్లి మామూలు జీవితం గడుపుతుంటాడు.
మళ్లీ తన అనుభవాలను మూటగట్టుకుని వచ్చి ఇక్కడ సినిమా తీస్తుంటాడు. ఐతే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో యువ, కుటుంబ ప్రేక్షకుల మనసు దోచిన శ్రీకాంత్కు ఆ తర్వాతి రెండు సినిమాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. ‘ముకుంద’ ప్రేక్షకులను మెప్పించకపోగా.. ‘బ్రహ్మాత్సవం’ అవమాన భారాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు అడ్డాల. చివరికి రీమేక్ మూవీ అయిన ‘నారప్ప’తో అతను రీఎంట్రీ ఇస్తున్నాడు.
శ్రీకాంత్ ఏంటి రీమేక్ ఏంటి.. పైగా సున్నితమైన సినిమాలు చేసే అతను ఇంత వయొలెంట్ మూవీని డైరెక్ట్ చేయడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ పునరాగమనానికి ఏదో ఒక దారి కోసం చూస్తున్న అతను.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లున్నాడు. ఐతే ‘నారప్ప’ తర్వాత ఏంటి అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. దీనికి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. ‘అన్నాయ్’ పేరుతో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్లు తెలిపాడు.
గుంటూరు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ చిత్రం అని అతను వెల్లడించడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో ఈ సినిమా చేయనున్నాడట శ్రీకాంత్. ఐతే దీనికి హీరో ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదట. శ్రీకాంత్ రీఎంట్రీ మూవీ గీతా బేనర్లోనే అని రెండేళ్ల కిందటే ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కకముందే ‘నారప్ప’లో ఛాన్స్ వచ్చింది. మరి శ్రీకాంత్ను నమ్మి ట్రయాలజీ యాక్షన్ ఫిలింలో చేసే హీరో ఎవరో చూడాలి.
This post was last modified on July 18, 2021 6:13 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…