యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’ ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆ చిత్రంతో తన పై భారీగా అంచనాలు పెంచేసిన తరుణ్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి.
ఇండస్ట్రీలో బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకుంటే.. ఈ ఐదేళ్లలో కేవలం ఒక్క సినిమా మాత్రమే తీశాడు. తన రెండో చిత్రం ‘నగరానికి ఏమైంది’ కూడా అంచనాలకు తగ్గట్లు లేదు. ఓ వర్గానికి బాగానే నచ్చినా అందరి ఆమోదం పొందలేకపోయింది. ఈ సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా తరుణ్ ఇంకో సినిమాను మొదలుపెట్టలేదు.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయడానికి తరుణ్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు కానీ.. అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా రెడీగా ఉన్నాడు. కానీ స్క్రిప్టు సంగతే ఎంతకీ తెగట్లేదు.
గుర్రపు స్వారీల నేపథ్యంలో వెంకీ హీరోగా తరుణ్ సినిమా చేయాలనుకుంటున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ కథ ఎంతకీ ఎందుకు కొలిక్కి రావట్లేదో అర్థం కావట్లేదు. వెంకీ స్థాయి హీరోతో సినిమా అంటే దాని మీదే ఫోకస్ పెట్టి కథలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలి. హీరో, నిర్మాతలను మెప్పించేలా స్క్రిప్టు రెడీ చేయాలి. కానీ ఏళ్లకు ఏళ్లు ఈ స్క్రిప్టు సంగతి ఒక కొలిక్కి రాకపోవడమేంటో అర్థం కావడం లేదు.
డైరెక్షన్ మీద ఆసక్తి తగ్గిపోయిందా అన్నట్లుగా తరుణ్ చూస్తే నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. టీవీ షో హోస్ట్ చేస్తున్నాడు. ‘నారప్ప’ ప్రమోషన్లకు వచ్చిన వెంకీ.. తరుణ్ సినిమా గురించి అడిగితే.. అతనేదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఏదో రాస్తున్నాడు. అది ఒక కొలిక్కి రానివ్వండి అన్నట్లుగా మాట్లాడాడు.
దీన్ని బట్టి స్క్రిప్టు విషయంలో వెంకీ సంతృప్తికరంగా లేడని అర్థమవుతోంది. తరుణ్ను ఇంతకుముందు ఈ సినిమా గురించి అడిగితే.. క్లైమాక్స్ అనుకున్నంత బాగా రాలేదని, దాని మీద వర్క్ చేస్తున్నామని చెప్పాడు. మరి ఇంకెప్పటికి స్క్రిప్టు సంగతి కొలిక్కి వచ్చి ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుందో చూడాలి.
This post was last modified on July 19, 2021 1:28 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…