కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తొలి చిత్రం.. తిమ్మరసు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘కిరాక్ పార్టీ’ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది.
స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఒక పాటను రిలీజ్ చేసింది. అది ఇన్స్టంట్గా జనాలకు నచ్చేస్తోంది. ఐతే అది రెగ్యులర్ పాటేమీ కాదు. ఈ పాట సినిమాలో కూడా ఉండదు. బాలీవుడ్ స్టయిల్లో చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. దీని ఇంట్రో భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్లు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన బ్రహ్మాజీ, వైవా హర్ష కలిసి ఈ ఇంట్రోను వినోదాత్మకంగా మార్చారు.
బ్లాక్ సూట్లేసుకుని కళ్లజోళ్లు పెట్టుకుని కెమెరాను ఫేస్ చేస్తూ ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, హర్ష నిలబడి ఉంటే.. వెనుక నుంచి సత్యదేవ్ వచ్చి.. ‘తిమ్మరసు’ సినిమాలో నిజానికి ఒక లవ్ సాంగ్ ఉందని.. కానీ లెంగ్త్ దృష్ట్యా దాన్ని తీసేశామని.. ఐతే ఈవిడ (ప్రియాంక) గోల భరించలేక ఈ ప్రమోషనల్ సాంగ్ చేశామని చెబుతూ.. లెట్స్ స్టార్ట్ అని పాటలోకి వెళ్లిపోయాడు సత్య. ఇక అక్కడ్నుంచి తిమ్మరసు గుణగణాలను వివరిస్తూ ఓ షో రీల్ నడుస్తుంటే మరోవైపు వీళ్ల హంగామా నడిచింది.
ప్రమోషన్లను ఏదో రెగ్యులర్గా లాగించేయకుండా ఇలా వెరైటీ ప్రమోషనల్ సాంగ్ చేయడం ద్వారా సినిమా కూడా కొంచెం భిన్నంగా ఉంటుందనే భరోసాను ఇచ్చింది చిత్ర బృందం. కరోనా-2 విరామం తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు బాగానే ఆసక్తితో ఉన్నారీ సినిమా మీద. కాకపోతే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం ఏ రోజు అన్నదే తేలట్లేదు.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…