Movie News

తిమ్మరసు భలే వెరైటీగా చేశాడే


కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తొలి చిత్రం.. తిమ్మరసు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘కిరాక్ పార్టీ’ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది.

స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఒక పాటను రిలీజ్ చేసింది. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేస్తోంది. ఐతే అది రెగ్యులర్ పాటేమీ కాదు. ఈ పాట సినిమాలో కూడా ఉండదు. బాలీవుడ్ స్టయిల్లో చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. దీని ఇంట్రో భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్లు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్‌లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన బ్రహ్మాజీ, వైవా హర్ష కలిసి ఈ ఇంట్రోను వినోదాత్మకంగా మార్చారు.

బ్లాక్ సూట్లేసుకుని కళ్లజోళ్లు పెట్టుకుని కెమెరాను ఫేస్ చేస్తూ ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, హర్ష నిలబడి ఉంటే.. వెనుక నుంచి సత్యదేవ్ వచ్చి.. ‘తిమ్మరసు’ సినిమాలో నిజానికి ఒక లవ్ సాంగ్ ఉందని.. కానీ లెంగ్త్ దృష్ట్యా దాన్ని తీసేశామని.. ఐతే ఈవిడ (ప్రియాంక) గోల భరించలేక ఈ ప్రమోషనల్ సాంగ్ చేశామని చెబుతూ.. లెట్స్ స్టార్ట్ అని పాటలోకి వెళ్లిపోయాడు సత్య. ఇక అక్కడ్నుంచి తిమ్మరసు గుణగణాలను వివరిస్తూ ఓ షో రీల్ నడుస్తుంటే మరోవైపు వీళ్ల హంగామా నడిచింది.

ప్రమోషన్లను ఏదో రెగ్యులర్‌గా లాగించేయకుండా ఇలా వెరైటీ ప్రమోషనల్ సాంగ్ చేయడం ద్వారా సినిమా కూడా కొంచెం భిన్నంగా ఉంటుందనే భరోసాను ఇచ్చింది చిత్ర బృందం. కరోనా-2 విరామం తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు బాగానే ఆసక్తితో ఉన్నారీ సినిమా మీద. కాకపోతే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం ఏ రోజు అన్నదే తేలట్లేదు.

This post was last modified on July 17, 2021 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

44 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago