స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి’ పూర్వ కథతో ఓ భారీ వెబ్ సిరీస్ తీయాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’లో బాగా హైలైట్ అయిన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కిందట సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ ఒక పట్టాన ఈ సిరీస్ పట్టాలెక్కలేదు.
ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశారు. తర్వాత వేరే టీంను పెట్టుకుని సరికొత్తగా బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఐతే ఇందులో కీలకమైన శివగామి పాత్రకు ‘భలే మంచి రోజు’ ఫేమ్ వామికా గబ్బి ఎంపికైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అంత కీలకమైన పాత్రకు వామిక ఎలా సూటవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి జనాల నుంచి. ఇలాంటి కాస్టింగ్తో ఈ సిరీస్కు ఏం ఊపు వస్తుందో అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.
ఐతే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తీసుకొచ్చే అప్డేట్ బయటికి వచ్చిందిప్పుడు. నెట్ఫ్లిక్స్ వారి బాహుబలి సిరీస్ కోసం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతారను ఎంచుకున్నారట. ఆమె పాత్ర ఏంటి అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ ప్రాజెక్టుకు నయన్ సంతకం చేయడం మాత్రం నిజమట. మరి దేవసేన పాత్రనేమైనా ఆమె చేయనుందా.. లేక కొత్త పాత్ర ఏదైనా ఆమెకు ఇస్తున్నారా అన్నది తెలియడం లేదు.
నిజానికి నెట్ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్లో శివగామిదే అత్యంత కీలకమైన పాత్ర. ఆ పాత్రనే నయన్కు ఇస్తే ఈ సిరీస్ రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయన్తో పాటు మరికొందరు పేరున్న తారాగణాన్ని తీసుకొచ్చి, నెట్ ఫ్లిక్స్ స్థాయికి తగ్గట్లు ఈ సిరీస్ను తీర్చిదిద్దితే.. ఇది ఇండియన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను ఇద్దరు యంగ్ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ చేతికి అప్పగించినట్లు తెలుస్తోంది.
This post was last modified on July 16, 2021 10:23 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…