స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి’ పూర్వ కథతో ఓ భారీ వెబ్ సిరీస్ తీయాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’లో బాగా హైలైట్ అయిన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కిందట సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ ఒక పట్టాన ఈ సిరీస్ పట్టాలెక్కలేదు.
ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశారు. తర్వాత వేరే టీంను పెట్టుకుని సరికొత్తగా బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఐతే ఇందులో కీలకమైన శివగామి పాత్రకు ‘భలే మంచి రోజు’ ఫేమ్ వామికా గబ్బి ఎంపికైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అంత కీలకమైన పాత్రకు వామిక ఎలా సూటవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి జనాల నుంచి. ఇలాంటి కాస్టింగ్తో ఈ సిరీస్కు ఏం ఊపు వస్తుందో అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.
ఐతే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తీసుకొచ్చే అప్డేట్ బయటికి వచ్చిందిప్పుడు. నెట్ఫ్లిక్స్ వారి బాహుబలి సిరీస్ కోసం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతారను ఎంచుకున్నారట. ఆమె పాత్ర ఏంటి అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ ప్రాజెక్టుకు నయన్ సంతకం చేయడం మాత్రం నిజమట. మరి దేవసేన పాత్రనేమైనా ఆమె చేయనుందా.. లేక కొత్త పాత్ర ఏదైనా ఆమెకు ఇస్తున్నారా అన్నది తెలియడం లేదు.
నిజానికి నెట్ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్లో శివగామిదే అత్యంత కీలకమైన పాత్ర. ఆ పాత్రనే నయన్కు ఇస్తే ఈ సిరీస్ రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయన్తో పాటు మరికొందరు పేరున్న తారాగణాన్ని తీసుకొచ్చి, నెట్ ఫ్లిక్స్ స్థాయికి తగ్గట్లు ఈ సిరీస్ను తీర్చిదిద్దితే.. ఇది ఇండియన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను ఇద్దరు యంగ్ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ చేతికి అప్పగించినట్లు తెలుస్తోంది.
This post was last modified on July 16, 2021 10:23 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…