దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనానికి పునాది పడ్డ చిత్రాల్లో ఒకటిగా ‘ఐస్ క్రీమ్’ను చెబుతారు చాలామంది. అంతకుముందే ఆయన స్థాయి పడిపోయింది కానీ.. మరీ పేలవంగా అయితే ఉండేవి కావు ఆయన చిత్రాలు. కచ్చితంగా ఎంతో కొంత ఎఫర్ట్ కనిపించేది. ఫ్లాప్ సినిమాల్లో కూడా వర్మ ముద్ర ఉండేది. ‘ఐస్ క్రీమ్’ మాత్రం అలా కాదు.
ఏమాత్రం శ్రద్ధ లేకుండా.. ఏం తోస్తే అది తీసినట్లుగా.. మరీ సిల్లీగా కనిపిస్తుందా చిత్రం. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న తేజస్వి మదివాడ ఈ సినిమాతోనే కథానాయిక అయింది. నవదీప్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు.
తేజస్వి అందాలను హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమోలు కొంత మేర యువతనకు ఆకర్షించి దీనికి ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ తక్కువ ఖర్చుతో డిజిటల్ కెమెరాతో సినిమా తీయడం ద్వారా మాత్రం వర్మ యంగ్ ఫిలిం మేకర్లకు స్ఫూర్తినిచ్చాడు. అంతకుమించి ‘ఐస్ క్రీమ్’ గురించి చెప్పడానికి ఏమీ లేదు.
‘ఐస్ క్రీమ్’ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. వర్మ దీనికి సీక్వెల్ తీయడం తెలిసిందే. అందులో జేడీ చక్రవర్తి, మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మరీ దారుణ ఫలితాన్నందుకుంది. వర్మ ఆ తర్వాత ఇంకా స్థాయి తక్కువ సినిమాలు ఎన్నో తీశాడు. ఈ మధ్య జనాలు ఆయన్ని అస్సలు పట్టించుకోని సంగతి తెలిసిందే.
వర్మ సినిమాలు విడుదలవుతున్నాయి. వెళ్లిపోతున్నాయి. అయినా సరే సినిమాలు తీయడం మాత్రం మానట్లేదు. ఇప్పుడు ‘ఐస్ క్రీమ్’ సిరీస్లో కొత్త సినిమా తీయడానికి ఆయన రెడీ అయిపోయారు.
ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్-2 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణనే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడట. వర్మతో కాస్త పేరున్న హీరోయిన్లెవరూ సినిమా చేసే పరిస్థితి లేదు. ‘ఐస్ క్రీమ్-3’కి ఇంకో కొత్త ఫేస్ను పట్టుకురావడం ఖాయం. మరి ఈ సినిమాతో ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడో చూడాలి.
This post was last modified on July 16, 2021 5:19 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…